న‌టుడు పోసాని ఇంట క‌ల‌క‌లం రేపిన క‌రోనా!

సినీ ఇండ‌స్ట్రీలో ఎంద‌రో ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డి నానా ఇబ్బందులు ప‌డిన సంగ‌తి తెలిసిందే. కొంద‌రైతే ప్రాణాలు కూడా విడిచారు. ఇదిలా ఉంటే.. తాజాగా సినీ న‌టుడు పోసాని కృష్ణ మురళి ఇంట క‌రోనా క‌ల‌క‌లం రేపింది. పోసాని కృష్ణమురళికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

పోసానితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని పోసాని స్వయంగా వెల్లడించాడు. ఇక గచ్చిబౌళి ఏఐజీ ఆస్పత్రిలో పోసాని చికిత్స తీసుకుంటున్నారు.

ఇక క‌రోనా పాజిటివ్‌ రావడం వల్ల రెండు సినిమాల షూటింగ్‌లు వాయిదా పడినట్లు తెలిపారు. తన వల్ల అసౌకర్యానికి గురైన డైరెకక్టర్‌, నిర్మాతలు, హీరోలు క్షమించాలని పోసాని కోరారు. కాగా, ప్ర‌స్తుతం పోసాని ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్టు తెలుస్తోంది.