టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు.
ఇదిలా ఉంటే.. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కుమార్, ఎన్టీఆర్ కాంబోలో ఓ సినిమా రాబోతోందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం విధితమే. కానీ, ఇప్పటివరకు ఈ కాంబో సెట్ కాలేదు. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ ఓ అడుగు ముందుకు కదిలిందని సమాచారం. ఇటీవల అట్లీ వీడియో కాల్ ద్వారా ఎన్టీఆర్ కి ఓ కథ చెప్పాడట.
అది కూడా ప్యూర్ లవ్ స్టోరీనట. చాలా కాలం నుంచి ఎన్టీఆర్ యాక్షన్, ఎమోషన్ ఉన్న కథలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. అందుకే ఈ సారి ఎన్టీఆర్తో డిఫరెంట్ లవ్ స్టోరీ ప్లాన్ చేశాడట అట్లీ. ఆ లవ్స్టోరీ ఎన్టీఆర్ కి నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో పక్కన పెడితే.. ఫ్యాన్స్ మాత్రం ఎన్టీఆర్-అట్లీ కాంబోపై సూపర్ ఎగ్జైట్గా ఉన్నారు.