రెబల్ స్టార్ ప్రభాస్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం సలార్. హోంబలే ఫిలింస్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది.
కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా.. మళ్లీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ఈ చిత్రంలో ఓ అదిరిపోయే స్పెషల్ సాంగ్ ఉంటుందట.
ఆ స్పెషల్ సాంగ్లో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రభాస్తో కలిసి చిందేయనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కాజల్తో సంప్రదింపులు కూడా పూర్తి అయ్యాయని టాక్ నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, గతంలో ప్రభాస్, కాజల్ జంటగా డార్లింగ్, మిస్టర్ ఫర్ఫెక్ట్ సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.