బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు హీరోగా టాలీవుడ్లోకి అడుగు పెడతాడా అని నందమూరి అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడూ, ఇప్పుడూ అంటున్నారు తప్పా.. మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం జరగలేదు. ఇటీవల బాలయ్య ఓ ఇంటర్వ్యూలో `ఆదిత్య 369` మూవీ సీక్వెల్తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ప్రకటించారు.
కానీ, ఇప్పటి వరకు ఈ సినిమా పట్టాలెక్కలేదు. అయితే తాజాగా తనయుడి ఎంట్రీ గురించి బాలయ్య ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఆదిత్య 369 సీక్వెల్తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెప్పిన బాలకృష్ణ.. ఈ మూవీకి `ఆదిత్య 999 మాక్స్` అనే టైటిల్ను ఖరారు చేసినట్టు కూడా పేర్కొన్నారు. అలాగే ఇంకా డైరెక్టర్ను ఫైనల్ చేయలేదన్న బాలయ్య… తాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా లేకపోలేదని తెలిపారు.
ఇక ఈ సినిమాను 2023లో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నామని బాలయ్య స్పష్టం చేశారు. అయితే బాలయ్య వ్యాఖ్యలతో.. నందమూరి ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నారు. ఇంకా రెండేళ్ల పాటు మోక్షు ఎంట్రీ కోసం వెయిట్ చేయాలా? అంటూ ఆసహనం వ్యక్తం చేస్తున్నారు.