టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్డర్ బాబీ కాంబోలో త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారు.
అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. దాని ప్రకారం.. ఈ చిత్రంలో చిరుకి జోడీగా బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాను ఎంపిక చేశారట. ఇటీవలె దర్శకుడు బాబీ.. సోనాక్షితో చర్చలు జరపగా ఆమె ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది.
కాగా, సోనాక్షి సిన్హా ఇది వరకే టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ, పలు కారణాల వల్ల ఆమె టాలీవుడ్ ఎంట్రీకి బ్రేక్ పడింది. ఇక తాజా వార్త కనుక నిజమైతే.. సోనాక్షి సిన్హా కు గ్రాండ్ ఎంట్రీ లభించినట్లేనని అనుకుంటున్నారు.