ధ‌నుష్‌తో టాలీవుడ్ డైరెక్ట‌ర్ పాన్ ఇండియా మూవీ..!

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లీడర్, ఫిదా ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన శేఖ‌ర్ క‌మ్ముల‌.. తాజా చిత్రం ల‌వ్ స్టోరీ.

నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల ఓ పాన్ ఇండియా మూవీ చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు. అది కూడా త‌మిళ స్టార్‌ హీరో ధ‌నుష్‌తో. అవును, తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్ర‌క‌ట కూడా వ‌చ్చింది.

అఫీషియ‌ల్: ధ‌నుష్‌తో శేఖ‌ర్ క‌మ్ముల చిత్రం

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధ‌నుష్ హీరోగా ఏషియన్ వారు ఓ ప్రాజెక్ట్ సెట్ చేసారు. వైవిధ్య‌భ‌రిత‌మైన క‌థాంశంతో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాను తెలుగు, త‌మిళం, హిందీలో విడుద‌ల చేయ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.