విల‌నిజం చూప‌బోతున్న సాయిప‌ల్ల‌వి..నాని మూవీపై న్యూ అప్డేట్‌!

ఇప్ప‌టి వ‌ర‌కు ఫీల్ గుడ్ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న సాయి ప‌ల్ల‌వి.. త్వ‌ర‌లోనే విల‌నిజం చూపించ‌బోతోంద‌ట‌. ప్ర‌స్తుతం ఈ భామ న‌టిస్తున్న చిత్రాల్లో శ్యామ్ సింగరాయ్ ఒక‌టి. న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి హీరోయిన్లుగా న‌టిస్తున్న‌ట్టు ఎప్పుడో క‌న్ఫార్మ్ అయింది. అయితే ఈ మూవీలో సాయి ప‌ల్ల‌విది హీరోయిన్ పాత్ర కాదని, విలన్ అని ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. పాత్ర న‌చ్చ‌డం వ‌ల్లే సాయి ప‌ల్ల‌వి ఒకే చెప్పింద‌ని.. ప్రస్తుతం ఆ పాత్ర కోసం ప్రత్యేక మ్యానరిజంపై ఆమె కసరత్తు కూడా చేస్తున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

మ‌రి ఇదే నిజ‌మైతే.. సాయి ప‌ల్ల‌విలో మ‌రో కొత్త కోణాన్ని చూడబోతున్నామ‌న్న‌మాట‌. కాగా, కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. అలాగే మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.