మ‌హేష్ సినిమాకు వ‌చ్చే నెలే ముహూర్తం?!

ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట చిత్రం చేస్తున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు.. ఆ త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త ప్ర‌స్తుతం నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేందుకు త్రివిక్ర‌మ్ ముహూర్తం పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. వచ్చేనెల నుంచే ఈ సినిమా షూటింగును మొదలుపెట్టే విధంగా సన్నాహాలు జరుగుతున్నాయట. అందుకు మ‌హేష్ బాబు కూడా ఒకే చెప్పార‌ని టాక్‌. మ‌రి ఇదే నిజ‌మైతే.. ఒక‌వైపు స‌ర్కారు వారి పాట‌, మ‌రోవైపు త్రివిక్ర‌మ్ సినిమా రెండూ ఒకేసారి మ‌హేష్ చేయ‌బోతున్నాడ‌న్న‌మ‌ట‌.