ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. లాంగ్ గ్యాప్ తర్వాత వీరి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో.. అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ప్రస్తుతం నెట్టింట్లో చెక్కెర్లు కొడుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో అక్కినేని హీరో సుమంత్ కూడా నటించబోతున్నాడట. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర ఉంటుందట. అందులో సుమంత్ బాగా సెట్ అవుతాడని భావించిన త్రివిక్రమ్.. వెంటనే ఆయనను సంప్రదించారట.
అయితే మహేష్కు మంచి స్నేహితుడు అయిన సుమంత్.. త్రివిక్రమ్కు వెంటనే ఓకే చెప్పారని ప్రచారం జరుగుతోంది. కాగా, మొదట్లో వరుస హిట్లు అందుకున్న సుమంత్ కెరీర్ ఇప్పుడు పూర్తిగా డల్ అయిపోయింది. మరి ఈయనకు మహేష్ సినిమానైనా వర్కోట్ అవుతుందో..లేదో.. చూడాలి.