సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార గత కొన్నేళ్లుగా కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్తో ప్రేమాయణం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రేమ పక్షులు ఇప్పటికే ఎన్నో రొమాంటిక్ ట్రిప్స్ వేశారు. ఏ పండగ వచ్చినా కలిసే చేసుకుంటారు. భార్యభర్తల కంటే ఎక్కువ అన్యూన్యంగా ఉంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు.
ఎప్పుడూ విఘ్నేష్తోనే ఉండే నయన్.. కరోనా వ్యాక్సిన్ తీసుకునే సమయంలో కూడా వదిలి పెట్టలేదు. తాజాగా ఇద్దరూ కలిసే వెళ్లి వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ విషయంలో ఎవరూ భయపడవద్దని, అర్హులైన అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కూడా కోరారు. ప్రస్తుతం వీరు వ్యాక్సిన్ వేయించుకుంటున్న ఫొటోలు వైరల్గా మారాయి.