మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ ఓ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
షూటింగ్ చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో కరోనా సెకెండ్ వేవ్ విరుచుకుపడింది. దీంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఆచార్య మళ్లీ జూలై నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
జులైలో సెట్స్ లో జాయిన్ అయ్యేందుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. ఇక బ్యాలెన్స్ షూటింగ్ త్వరగా ఫినిష్ చేసి.. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.