కంగనా రనౌత్ వ్యక్తిగత బాడీగార్డ్ కుమార్ హెగ్డేపై అత్యాచార కేసు నమోదైంది. ముంబయికి చెందిన ఓ మేకప్ ఆర్టిస్ట్ తనపై కుమార్ హెగ్డే లైంగిక దాడికి దిగాడని ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే ముంబయిలోని డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ క్రమంలో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ నటి కంగనా రనౌత్ బాడీగార్డ్ కుమార్ వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో పాటు తన నుంచి రూ. 50 వేలు తీసుకున్నాడని పేర్కొంది.
కుమార్కు ఆ మేకప్ ఆర్టిస్ట్తో ఎనిదేళ్ల క్రితం పరిచయం ఏర్పడినట్లు సమాచారం. గతేడాది జూన్లో వివాహం చేసుకుంటానని ప్రపోజ్ చేశాడని ఈ నేపథ్యంలో తన ఫ్లాట్కు వచ్చిన కుమార్ తనపై పలుమార్లు లైంగిక దాడికి దిగాడని ఆరోపణలు చేసింది. అంతటితో ఆగకుండా కుమార్ తన సొంత ప్రాంతమైన కర్ణాటకకు వెళ్లే ముందు తనకు ఏప్రిల్ 27న డబ్బులు ఇచ్చినట్లు మేకప్ ఆర్టిస్ట్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతోంది. కంగనా ఈ కేసు విషయంలో ఇంకా స్పందించలేదు.