ఆగిపోయిన వ‌రుణ్ `గ‌ని`..క్లారిటీ ఇచ్చేసిన ద‌ర్శ‌కుడు!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ తాజా చిత్రం గ‌ని. కిరణ్ కొర్రపాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద, అల్లు వెంక‌టేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో వ‌రుణ్ బాక్స‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. అయితే కిరణ్‌ కొర్రపాటి సినిమా తీస్తున్న విధానం వరుణ్‌కి నచ్చలేదని, ఈ విష‌యంపైనే వారిద్ద‌రి మధ్య విభేదాలు వచ్చాయని.. దాంతో గని సినిమా ఆగిపోయిందని వార్తలు గ‌త కొద్ది రోజులు నుంచి నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

గని ఆగిపోయిందనే ప్రచారంపై ద‌ర్శ‌కుడు కిర‌ణ్ స్పందిస్తూ..ఈ వార్తల్లో నిజం లేద‌ని..ఇప్పటి వరకూ వచ్చిన గని అవుట్‌పుట్‌పై వరుణ్‌ తేజ్‌ సంతోషంగా ఉన్నారు. మా మధ్య విభేదాలంటూ వచ్చిన వార్తలను ఎవరూ నమ్మకండి అంటూ ఓ క్లారిటీ ఇచ్చేశాడు.