మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్.. వీరిద్దరూ సీనియర్ హీరోలే అయినా వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి చేతుల్లో మూడు, నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో వీరు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. కరోనా దెబ్బకు ఓటీటీ సంస్థల క్రేజ్ బాగా పెరిగిపోయింది.
దీంతో హీరో,హీరోయిన్లు కూడా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ చేస్తూ ఓటీటీ ఫ్లాట్ఫామ్లో అడుగు పెడుతున్నారు. ఈ క్రమంలోనే వెంకీ కూడా వెబ్ సిరీస్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తుండడంతో.. ఆయన అన్న, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కథలను రెడీ చేసే పనిలో పడ్డారట.
ఇక మరోవైపు చిరు కూడా మంచి కథ, కథనాలు ఉంటే వెబ్ సిరీస్లో నటించడానికి సిద్ధంగా ఉన్నారట. దీంతో అల్లు అరవింద్ ఆహా ఫ్లాట్ఫామ్లో చిరు కోసం ఓ వెబ్ సిరీస్ను ప్లాన్ చేస్తునట్టు ప్రచారం జరుగుతోంది. కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి తగ్గిన తర్వాత ఈ సీనియర్ హీరోల వెబ్ సిరీస్పై అధికారిక ప్రకటన రావొచ్చని అంటున్నారు.