ద‌ర్శ‌కుల‌కు త‌ల‌నొప్పిగా మారిన‌ అనుష్క..కార‌ణం అదేన‌ట‌?

అనుష్క శెట్టి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సూపర్ సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన అనుష్క‌.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక అరుంధతి చిత్రం త‌ర్వాత లేడీ ఓరియంటెండ్ సినిమాలంటే ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చే పేరు అనుష్క‌దే.

ఈ క్ర‌మంలోనే పంచాక్షరి, సైజ్ జీరో, భాగమతి, నిశ్శబ్ధం వంటి సినిమాలు చేసింది అనుష్క‌. కానీ, ఇవేమి ప్రేక్ష‌కుల‌ను పెద్ద‌గా అల‌రించ‌లేదు. అదే స‌మ‌యంలో అనుష్క సినిమాలు చేయ‌డం కూడా బాగా త‌గ్గించేసింది. దీంతో ఆమెకు ఆఫ‌ర్లు త‌గ్గిపోయాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది.

అయితే నిజానికి అనుష్కను సంప్రదించే దర్శక, నిర్మాతల సంఖ్య ఏమి తగ్గలేదట. కానీ ఆమెనే ఏ ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని.. అదే ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారింద‌ని అంటున్నారు. ఇక ప్ర‌స్తుతం అనుష్క యూవీ క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై పి.మహేశ్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నట్లు ఎప్ప‌టి నుంచి వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ, ఈ ప్రాజెక్ట్‌పై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.