ఫహద్ ఫాజిల్, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం అనుకోని అతిథి. సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో వివేక్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అన్నంరెడ్డి కృష్ణకుమార్ నిర్మించారు.
మే 28 నుంచి ఆహా ఓటీటీ వేదికపై ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అయితే విడుదలకు ముందే ఊహించని విషాయం చోటు చేసుకుంది. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన అన్నం రెడ్డి కృష్ణ కుమార్ ఈరోజు ఉదయం విశాఖలో ఆకస్మిక గుండెపోటుతో మరణించారు.
మరి కొద్ది రోజులలో సినిమా విడుదల కానుండగా.. ఇంతలోనే ఇలా జరగడం చిత్ర యూనిట్ను తీవ్రంగా కలిచి వేస్తోంది. ఇక మరోవైపు కృష్ణ కుమార్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యాక్తం చేస్తున్నారు.