ప‌వ‌న్ నో చెప్పుంటే `వ‌కీల్ సాబ్‌`ను ఆ హీరో చేసేవాడ‌ట‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. బాలీవుడ్‌లో హిట్ అయిన `పింక్`కి రీమేక్‌గా ఈ చిత్రాన్ని వేణు శ్రీ‌రామ్ తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రుతి హాస‌న్ న‌టించ‌గా..నివేత థామస్, అంజలి, అనన్య నాగల్ల కీల‌క పాత్ర‌లు పోషించారు.

భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ సినిమా ఏప్రిల్ 9న(నేడు) ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. అయితే ఇప్పటికే దుబాయ్, అమెరికా లాంటీ ప్రాంతాల్లో ఈ షోకు ప్రీమియర్స్ పడ‌గా.. వ‌కీల్ సాబ్‌పై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. సినిమాపై హైప్ క్రియేట్ చేసేందుకు చిత్ర యూనిట్ జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా డైరెక్ట‌ర్ వేణు శ్రీ‌రామ్ ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన‌గా.. సినిమాకు సంబంధించి ఎన్నో విష‌యాల‌ను పంచుకున్నారు.

ఈ క్ర‌మంలోనే `పవన్ కల్యాణ్ గారు ఒక‌వేళ‌ ఈ సినిమా చేయనని అంటే, అప్పుడు ఈ కథ కోసం ఏ హీరోను ఎంచుకునేవారు? అనే ప్రశ్నించ‌గా.. నాగార్జున గారిని ఎంచుకునేవాడిని .. ఎందుకంటే ప్రయోగాలు చేయడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు` అని వేణు చెప్పుకొచ్చాడు. అంటే ప‌వ‌న్ నో చెప్పుంటే.. వ‌కీల్ సాబ్ నాగ్ చేసేవాడ‌న్న‌మాట‌.‌