దగ్గుబాటి కుటుంబం నుంచి మరో హీరో ఇండస్ట్రీకి ఎంట్రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ రీఎంట్రీకి అంతా రాక్సీ అయింది. అతి త్వరలోనే ఓ ప్రముఖ దర్శకుడితో అభిరామ్ చిత్రం చేయనున్నారు. ప్రముఖ సెన్సిబుల్ దర్శకుడు తేజ దర్శకత్వంలో ఓస్క్రిప్ట్ ని సురేష్బాబు ఓకే చేసినట్లు టాక్. దీంతో త్వరలోనే అభిరామ్ను గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు సురేష్బాబు.
తేజ డైరెక్ట్ చేసే ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించనున్నట్లు సమాచారం. ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, అతి త్వరలోనే ఓ మంచి ప్రాజెక్ట్ ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలిపారు. ఇక పోతే తేజ, ఆర్పీ పట్నాయక్ కాంబినేషన్లో ఇప్పటికే జయం, నీ స్నేహం,నువ్వు నేను వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. అలాగే తేజ దర్శకత్వంలో రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రం కూడా పెద్ద విజయం పొందింది.