పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్లో నాగ్ అశ్విన్ సినిమా ఒకటి. ఈ చిత్రంలో దీపికా పదుకోని హీరోయిన్గా నటించగా.. బాలీవుడ్ బిగ్బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేయనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు.
ఇప్పటికే ప్రభాస్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. దీంతో ఎప్పుడెప్పుడు ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా ఆరంభం అవుతుందా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. నాగ్ అశ్విన్ కూడా ఏ ఏడాది జూలై నుంచి సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని ప్రకటించారు.
అయితే కరోనా వచ్చి మొత్తం మార్చేసింది. తాజా సామాచారం ప్రకారం.. ఈ చిత్రం షూటింగ్ ఇప్పట్లో లేనట్టే అని అంటున్నారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా షూట్ను అక్టోబర్కు వాయిదా వేశారట. ఈలోపు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్, యాక్షన్ సీక్వెన్స్, టెక్నికల్ పనులపై నాగ్ అశ్విన్ దృష్టి పెట్టనున్నారట.