బ‌న్నీకి క‌రోనా..పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్‌!

చైనాలో పుట్టుకొచ్చిన క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా భార‌త్‌లో గ‌త నెల రోజులుగా క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు రికార్డు స్థాయిలో న‌మోదు అవుతున్నాయి. ఇక ఈ మ‌హ‌మ్మారి సామాన్యుల‌తో పాటు సెల‌బ్రెటీలు, రాజ‌కీయ నాయ‌కులు, క్రీడా కారులు ఇలా అంద‌రిపై ప్ర‌తాపం చూపిస్తోంది.

తాజాగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా క‌రోనా బారిన సంగ‌తి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. ప్ర‌స్తుతం బ‌న్నీ స్వీయ నిర్భంధంలో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అయితే బ‌న్నీకి క‌రోనా సోక‌డంతో పూజా హెగ్డే ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. బ‌న్నీ చేసిన ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ.. `అమూల్యకి తోడుగా బంటి వచ్చేశాడు. నా శక్తిని నీకు కొంచెం పంపిస్తున్నాను జాగ్రత్తగా ఉండు` అంటూ కామెంట్ పెట్టింది.

అల వైకుంఠపురంలో చిత్రంతో వీరిద్ద‌రూ జంట‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. అందులోని బంటి, అమూల్య పాత్రలను మెన్షన్‌ చేస్తూ పూజా ఈకామెంట్‌ చేసింది. కాగా, పూజా హెగ్డేకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వారం ప్రారంభంలోనే పూజా హెగ్డే కరోనా బారిన పడ్డారు. ఆమె కూడా ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంటున్నారు.