మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం `ఫిదా`. ఈ చిత్రం ద్వారానే సాయి పల్లవి తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు.
ఈ చిత్రాన్ని ఓ దృశ్యకావ్యంగా, ఫీల్గుడ్ మూవీగా మలిచి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు శేఖర్ కమ్ముల. అయితే ఈ చిత్రం కథ మొదట వరుణ్ వద్దకు వెళ్లలేదట. ఈ విషయాన్ని శేఖర్ కమ్ములనే స్వయంగా తెలిపారు.
తాగాజా `ఆలీతో సరదాగా` ప్రోగ్రామ్లో శేఖర్ కమ్ముల పాల్గొనగా.. అందుకు సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో ‘ఫిదా’ స్టోరీని తొలిత మహేశ్ బాబుకు, ఆపై రామ్ చరణ్ కు చెప్పానని, వారు రిజెక్ట్ చేయడంతో ఆ సినిమా చేసే అవకాశం వరుణ్ తేజ్ కు వచ్చిందని దర్శకుడు శేఖర్ కమ్ముల వెల్లడించారు.