మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘సూపర్ మచ్చి’. పులి వాసు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రచితా రామ్ హీరోయిన్గా నటిస్తోంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ, ప్రస్తుతం కరోనా దెబ్బకు ఏ సినిమానూ థియేటర్కు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలోనే సూపర్ మచ్చి చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో వచ్చే నెల ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయబోతున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. కాగా, ఇప్పటికే యాంకర్ అనసూయ థ్యాంక్ యూ బ్రదర్ చిత్రాన్ని కూడా ఆహాలో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.