తెలంగాణలో వేసవి సెలవులు ఎప్పటి నుంచి అంటే..!?

తెలంగాణ విద్యాశాఖ వేసవి సెలవులను ప్రకటించింది. ఏప్రిల్ 27 నుండి మే 31 వరకు పాఠశాల, జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. కరోనా నేపథ్యంలోనే సెలవుల పై సీఎం కేసీఆర్ , మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు కలిసి విద్యాశాఖ అధికారులతో ఆదివారం ఉదయం సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పత్రిక ప్రకటన రిలీజ్ చేశారు.

కాబ్బటి రేపు అనగా సోమవారం 2020-21 విద్యాసంవత్సరానికి చివరి రోజుగా ఆమె పేర్కోన్నారు. అయితే విద్యా సంవత్సరాన్ని తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారనే నిర్ణయాన్ని జూన్ 1న తీసుకుంటారని ఆమె తెలిపారు. తిరిగి పాఠశాలలు, జూనియర్ కళాశాలలను ఎప్పుడు తెరిచేది కోవిడ్ – 19 పరిస్థితిని అనుసరించి జూన్ 1న ప్రభుత్వం నిర్ణయిస్తుందని మంత్రి తెలిపారు. ఏప్రిల్ 26వ తేదీని ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి రోజుగా పరిగణిస్తామని మంత్రి పేర్కొన్నారు.