తమిళ రంగస్థలం విడుదలకి బ్రేక్ పడింది.!

రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం చిత్రం తమిళ విడుదలకి బ్రేక్ పడింది. 2018లో తెలుగులో ఘానా విజయం సాధించిన ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. చెప్పినట్టు గా కన్నడలో ఇప్పటికే రిలీజ్ కూడా చేశారు. ఇపుడు తమిళనాట రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ట్రైలర్ కట్ చేసి ఈనెల 30న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

కానీ కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కారణంగా తమిళనాడు ప్రభుత్వం ఈ నెల 26 నుంచి స్వచ్ఛందంగా లాక్ డౌన్ విధిస్తున్నట్టు తెలిపింది. దీంతో అన్ని మూవీ థియేటర్స్ సహా అన్నీ మూసి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా రామ్ చరణ్ సూపర్ హిట్ మూవీ రంగస్థలం తమిళ వర్షన్ కు బ్రేక్ పడింది అన్న మాట. మరలా ఈ చిత్రం రిలీజ్ కి ఎప్పుడు సిద్ధం అవుతుందో వేచి చూడాలి.