టీడీపీ మీడియా పిచ్చి ముదిరిందా

ఎక్క‌డయినా.. ఎప్పుడ‌యినా స‌మ‌యం, సంద‌ర్భం, ఔచిత్యం.. పాటించి ప్ర‌వ‌ర్తించాలి. లేక‌పోతే అభాసుపాల‌వ్వ‌క త‌ప్ప‌దు. ఇప్పుడ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌, సీఎం చంద్ర‌బాబు భేటీని కూడా తమ‌కు అనుకూలంగా మ‌లుచుకుని.. టీడీపీ అనుకూల మీడియా మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఉద్దానంలోని కిడ్నీ బాధితులు ప‌డుతున్న ఇబ్బందులు, వాటిపై అధ్య‌యనం చేసిన హార్వ‌ర్డ్ వ‌ర్సిటీ ప్ర‌తినిధులు అంద‌జేసిన నివేదిక‌ను చంద్ర‌బాబుకు అంద జేసేందుకు ప‌వ‌న్ వెళ్లార‌నేది అంద‌రికీ తెలిసిందే! కానీ ఈ విష‌యాన్ని సైడ్ ట్రాక్ ప‌ట్టించి.. రాష్ట్రం గురించి చంద్ర బాబు ప‌డుతున్న ఇబ్బందులు, క‌ష్టాలు వినేందుకు వెళ్లారేమో అనేంత‌గా.. మీడియ‌లో క‌థ‌నాలు ప్ర‌చురించే శాయి. వీటిని చూసిన‌, చ‌దివిన వారికి `టీడీపీ మీడియా పిచ్చి ఇంత‌లా ముదిరిపోయిందా` అని అనిపించ‌క మాన‌దు!!

సీఎం చంద్రబాబు, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ భేటీ రాష్ట్ర రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అయితే ఈ భేటీని త‌మ‌కు అనుకూలంగా మ‌ర్చుకోవ‌డంలో టీడీపీ మీడియా అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించింద‌నే కామెంట్స్ విన‌ప‌డుతు న్నాయి. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాన్ని వివ‌రించేందుకు ప‌వ‌న్ వెళితే.. టీడీపీ అనుకూల మీడియా ప్రెజెంట్ చేసిన తీరు ఇంకోలా ఉంది. చంద్ర‌బాబు చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌ను మెచ్చుకోవ‌డం కోస‌మే ప‌వ‌న్ వెళ్లిన‌ట్టు చిత్రీక‌రించారు. ఉద్దానం స‌మ‌స్యను వీలైనంత చిన్న‌ది చేసి చూపుతూ, కాపుల రిజ‌ర్వేష‌న్లు, పోల‌వ‌రం ప్రాజెక్టు, అమ‌రావ‌తి నిర్మాణం, బెల్టు షాపుల నియంత్ర‌ణ వంటి విష‌యాల్లో చంద్ర‌బాబు కృషిని ప‌వ‌న్ మెచ్చుకున్న‌ట్టు క‌థ‌నాలు ప్ర‌చురించారు.

ప‌వ‌న్ తో తాను ఏయే విష‌యాల‌పై చ‌ర్చించాన‌నేది ముఖ్య‌మంత్రి నేరుగా మీడియాతో చెప్ప‌లేదు. కానీ దాన్ని ఓ మీడియా సంస్థ‌గా.. ప్ర‌జ‌ల ముందుకు తీసుకెళ్లిన తీరు అంద‌రినీ విస్మ‌యానికి గురిచేస్తోంది. ఆ క‌థ‌నం ప్ర‌కారం… కాపుల రిజ‌ర్వేష‌న్ల విష‌య‌మై ప‌వ‌న్ తో చంద్ర‌బాబు మాట్లాడుతూ, న్యాయ‌ప‌రంగా ఎలాంటి ఇబ్బందులూ లేని విధంగా రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని తాము చూస్తుంటే, ఈ కృషిని గుర్తించ‌కుండా కొంత‌మంది ఉద్య‌మాలు చేయ‌డ‌మేంట‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించార‌ట‌! అంతేకాదు, కాపుల రిజ‌ర్వేష‌న్ల విష‌య‌మై చంద్ర‌బాబు అనుస‌రిస్తున్న విధాన‌మే స‌రైంద‌ని ప‌వ‌న్ మెచ్చుకున్న‌ట్టు కూడా రాశారు.

రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి అమ‌రావ‌తి నిర్మిస్తున్న‌ది త‌న స్వార్థం కోసం కాద‌నీ, కానీ కొంత‌మంది అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారంటూ ప‌వ‌న్ కు వివ‌రించార‌ట‌. పోల‌వ‌రం పూర్త‌య్యేలోపు రైతులకు నీరివ్వాల‌ని ప‌ట్టిసీమ చేప‌డితే దానిపై కూడా విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేశార‌ట‌. ఇక ఉద్దానం స‌మ‌స్య మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ప‌వ‌న్ – చంద్ర‌బాబు భేటీని ఈ విధంగా ప్ర‌జ‌ల‌కు చూపిస్తున్నారు. ప్ర‌తి అంశాన్నీ అనుకూలంగా మ‌లుచుకుని చంద్ర‌బాబును ఆకాశానికి ఎత్తేస్తూ.. మిగిలిన వ‌న్నింటినీ అస‌లు ఎవ‌రి కంటికీ క‌నిపించ‌కుండా చేసేస్తోంది మీడియా!