రాజ‌మౌళికి మ‌హేష్ టెన్ష‌న్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు టాలీవుడ్ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళికి పెద్ద టెన్ష‌న్‌గా మారాడ‌ట‌. మ‌హేష్ పెట్టే టెన్ష‌న్‌కు రాజ‌మౌళికి చిరాకు వ‌స్తోంద‌ట‌. ఇప్పుడిదే విష‌యం టాలీవుడ్‌లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే బాహుబ‌లి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌కు కంటిన్యూగా వ‌స్తోన్న బాహుబ‌లి-2ను వ‌చ్చే స‌మ్మ‌ర్ కానుక‌గా ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

బాహుబ‌లి-2కు సౌత్ అంత‌టాతో పాటు బాలీవుడ్‌లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇక ఇదిలా ఉంటే మ‌హేష్‌బాబు-సౌత్ ఇండియ‌న్ క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో…. తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా రిలీజ్‌ను సైతం 2017 వేసవిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అది కూడా మహేష్ కెరీర్ లో బిగెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచి పోకిరి రిలీజ్ డేట్ అయిన ఏప్రిల్ 28ననే ఈ సినిమాను కూడా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు.

దీంతో బాహుబ‌లి-2, మ‌హేష్‌-మురుగ‌దాస్ సినిమా సైతం ఒకే డేట్‌కు వ‌స్తున్నాయి. ఈ రెండు సినిమాల కోసం సౌత్ టు నార్త్ సినిమా ప్రేక్ష‌కులు ఎదురు చూస్తున్నారు. రెండూ ఒకే రోజు త‌ల‌ప‌డితే రెండు సినిమాల‌కు ఎంతోకొంత ఎఫెక్ట్ ఉంటుంది.

మ‌హేష్‌-మురుగ‌దాస్ సినిమాను కూడా బాహుబ‌లి-2 రిలీజ్ డేట్‌నే రిలీజ్ చేస్తున్న‌ట్టు వార్త‌లు రావ‌డం రాజ‌మౌళితో పాటు బాహుబ‌లి-2 టీంను కాస్త టెన్ష‌న్ పెడుతోంద‌ట‌. మ‌రి ఈ రెండు సినిమాల్లో బాహుబ‌లిపై ఉన్న అంచ‌నాల దృష్ట్యా మ‌హేష్ త‌న సినిమాను కొద్ది రోజులు వాయిదా వేసుకుంటేనే మంచిద‌న్న టాక్ వ‌స్తోంది. గతంలో కూడా బాహుబలి తొలి భాగం రిలీజ్ సమయంలో తన శ్రీమంతుడు సినిమాను నెల రోజుల పాటు వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే.