హోదాపై ప‌వ‌న్ కూడా ఢిల్లీకి దాసోహ‌మా?!

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత రాజ‌ధాని కోల్పోయి, అటు ఆర్థికంగా, ఇటు ఉద్యోగాల ప‌రంగా తీవ్రంగా న‌ష్ట‌పోయిన ఏపీ విష‌యంలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఎంతో స‌పోర్టింగ్‌గా మాట్టాడిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయాడు. అది కూడా రెండు రోజుల కింద‌ట బీజేపీ ర‌థ సార‌థి.. అమిత్ షా విజ‌య‌వాడ గ‌డ్డ‌పై .. తాము హోదా క‌న్నా ఎక్క‌వే ఇచ్చామ‌ని, హోదా ఉన్న రాష్ట్రాల‌కు కూడా ఇంత క‌న్నా ఏమీ ద‌క్క‌డం లేద‌ని […]

టీడీపీతో బీజేపీ క‌టీఫ్ త‌ప్ప‌దా?! 

ప్ర‌స్తుతం ఏపీలో టీడీపీతో అధికారం పంచుకున్న బీజేపీ నేత‌లు 2019 ఎన్నిక‌లే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలోనే బీజేపీ ర‌థ‌సార‌థి.. అమిత్ షా.. నిన్న ఏపీలో పెద్ద ఎత్తున స‌భ నిర్వ‌హించారు. అయితే, ఇక్క‌డ ఆస‌క్తి క‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. టీడీపీతో పొత్తు వద్దంటూ ప‌లువురు నేత‌లు, కార్య‌క‌ర్త‌లు షా స‌భ‌లో, బ‌య‌టా కూడా ప్ల‌కార్డులు ప‌ట్టుకుని నినాదాలు చేశారు. టీడీపీని వ‌దిలేద్దాం అని షాకు చెప్ప‌క‌నే చెప్పారు. విజయవాడలో గురువారం కార్యక్రమం ప్రారంభమైన […]

చంద్ర‌బాబు అభివృద్ధి బీజేపీ అక్కౌంట్‌లోకా..

రాష్ట్రంలో రోజుకు 18 గంట‌లు క‌ష్ట ప‌డుతూ.. తాను ప‌డుకోకుండా.. అధికారుల‌ను కూడా ప‌డుకోనివ్వ‌కుండా ఆరు ప‌దుల వ‌యసు దాటి మ‌న‌వ‌డిని, కుటుంబాన్ని సైతం వ‌దిలి రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం క‌ష్టిస్తున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు క‌ష్టం మొత్తం ఇప్పుడు బీజేపీ ఖాతాలోకి చేరిందా? అంటే ఔన‌నే అంటున్నారు విశ్లేష‌కులు. రాష్ట్రంలో 2014 ఎన్నిక‌ల త‌ర్వాత అధికారం చేప‌ట్టిన బాబు.. తీవ్ర క‌ష్ట న‌ష్టాలు స‌హా రాజ‌ధాని సైతం లేని ఏపీని అభివృద్ధి బాట ప‌ట్టించేందుకు ఎన్నో […]

బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ న‌ష్ట‌పోయిందా?

బీజేపీ-టీడీపీల బంధం ఈనాటిది కాదు! ప్ర‌స్తుతం తీవ్ర అనారోగ్యంతో మంచంలో ఉన్న మాజీ ప్ర‌ధాని వాజ‌పేయి కాలం నుంచి టీడీపీ -బీజేపీల మ‌ధ్య బంధం ఉంది. ఈ క్ర‌మంలోనే 2014 ఎన్నిక‌ల్లో ఏపీలో పొత్తు పెట్టుకుని చంద్ర‌బాబు గెలుపు బావుటా ఎగ‌రేశారు. అక్క‌డితో ఆగ‌కుండా కేంద్రంలోనూ బీజేపీ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ప‌లికి.. మంత్రి ప‌దవులు సైతం కొట్టేశారు. అదేవిధంగా ఏపీలోనూ బీజేపీ స‌భ్యుల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. ఇంత బ‌లంగా ఉన్న ఈ బంధం.. ఇప్పుడు బీట‌లు […]

బోండా ఉమాపై బాబు చ‌ర్య‌లు ఖాయ‌మా?

విజయవాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే, టీడీపీ ఫైర్ బ్రాండ్‌గా ఎద‌గాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న బోండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు.. ఉర‌ఫ్ బోండా ఉమా..కి పొలిటిక‌ల్‌గా మూడింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. రేపో మాపో ఆయ‌న‌పై బాబు వేటు వేయ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల కాలంలో బోండా ఉమా హ‌ద్దు మీరుతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఎంపీ నాని అండ చూసుకుని రెచ్చిపోతున్నార‌ని కూడా తెలుస్తోంది. ఆర్‌టీఏ గొడ‌వే దీనికి ప్ర‌ధాన ఉదాహ‌ర‌ణ. ఆర్టీఏ క‌మిష‌న‌ర్ సెక్యూరిటీని ఉమా బ‌లంగా నెట్ట‌డం అంద‌రికీ తెలిసిందే. ఇక‌, […]

రాధా.. జ‌గ‌న్‌ల బంధానికి బీట‌లు..

విజ‌య‌వాడ‌లో త‌న కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న వంగ‌వీటి వంశ వార‌సుడు వంగ‌వీటి రాధాకృష్ణ‌కి వైసీపీ అధినేత జ‌గ‌న్‌కి బెడిసి కొట్టింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే రాజ‌కీయంగా వైసీపీకి కొంత‌కాలంగా త‌ట‌స్థంగా ఉంటూ వ‌స్తున్న రాధాని యువ నాయ‌క‌త్వం నుంచి జ‌గ‌న్ ఇటీవ‌ల త‌ప్పించారు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న రాధా.. జ‌గ‌న్ పార్టీకి గుడ్ బై చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. వాస్త‌వానికి తండ్రి రంగా నుంచి వ‌చ్చిన వార‌స‌త్వంతో కాంగ్రెస్‌లో త‌న కంటూ గుర్తింపు పొందిన […]

ల‌గ‌డ‌పాటి రూటు టీడీపీనా..? వైసీపీనా..?

విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ్‌గోపాల్ పేరు చెపితేనే మ‌న‌కు ర‌గ‌డపాటి అన్న క్యాప్ష‌న్ గుర్తుకు వ‌స్తుంది. రాష్ట్ర విభ‌జ‌న జ‌రుగుతున్న‌ప్పుడు పార్ల‌మెంటులో పెప్ప‌ర్ స్ప్రేతో నానా హ‌డావిడి చేసిన రాజ్‌గోపాల్ స‌ర్వేల‌కు పెట్టింది పేరు… రాజ్‌గోపాల్ స‌ర్వే అంటే కాస్త అటూ ఇటూగా తుది ఫ‌లితానికి ద‌గ్గ‌ర‌గా ఉంటుంద‌న్న విష‌యం చాలాసార్లు రుజువైంది. ఇక రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత రాజ్‌గోపాల్ కాంగ్రెస్‌కు దూర‌మై రాజ‌కీయంగా క్రియాశీల‌కంగా లేరు. ఇక కొద్ది రోజులుగా రాజ్‌గోపాల్ పొలిటిక‌ల్ రీ […]

ఏపీలో అత్తాకోడ‌ళ్ల పోరు ఉంటుందా..!

ఏపీలో ఎన్నికలు ఇంకా కాస్త దూరంలోనే వున్నాయి. మోడీ డెసిష‌న్‌తో 2018లోనే జ‌మిలీ ఎన్నిక‌లు ఉంటాయ‌న్న టాక్ బ‌లంగా వ‌స్తోంది. దీంతో అప్పుడే రాజ‌కీయ వేడి రాజుకుంది. ఈ క్ర‌మంలోనే ఏపీలో అత్తాకోడ‌ళ్లు అయిన కేంద్ర మాజీ మంత్రి ద‌గ్గుపాటి పురందేశ్వ‌రి వ‌ర్సెస్ నారా బ్రాహ్మ‌ణి మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన పోరు ఉంటుందా ? అన్న‌దానిపై ఆస‌క్తిక‌ర‌మైన స‌స్పెన్స్ నెల‌కొంది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే గ‌తంలో కాంగ్రెస్ త‌ర‌పున బాప‌ట్ల‌, విశాఖ‌ప‌ట్నం నుంచి ఎంపీగా గెలిచిన పురందేశ్వ‌రి గ‌త […]

బోండాకు స‌మ‌యం చూసి వాత‌పెడ‌తారా?

తాము ఆశించిన ప‌ద‌వులు ద‌క్క‌ని సంద‌ర్భాల్లో నేత‌లు తీవ్ర అసంతృప్తికి గుర‌వ‌డం.. అధిష్ఠానంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మే!! ఒక్కోసారి ప్ర‌భుత్వ విధానాలపైనే మాట్లాడి అటు అధిష్ఠానం దృష్టిలో, ఇటు ప్ర‌జ‌ల దృష్టిలో చుల‌క‌న‌గా మిగిలిపోతారు. ప్ర‌స్తుతం ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు ప‌రిస్థితి కూడా ఇలానే మారింది. కాపుల అభివృద్ధికి ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నామ‌ని ఒక‌ప‌క్క టీడీపీ పెద్ద‌లంతా నొక్కిచెబుతుంటే.. కాపుల‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతోంద‌ని వ్యాఖ్యానించి.. అధిష్ఠానం దృష్టిలో నోటెడ్ అయ్యారు. అయితే వివాదం స‌ద్దుమ‌ణిగినా.. మ‌రి […]