తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే, దాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది. వాస్తవాల్ని దాచిపెట్టి, కెసియార్ ఉత్త సినిమా చూపించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి కాంగ్రెసుతోపాటు ఇతర విపక్షాల నుంచి. వాస్తవాలతో కూడిన పవర్పాయింట్ ప్రెజెంటేషన్ మేం ఇస్తామని కాంగ్రెసు ఎంతో హడావిడి చేసినా, ఆలస్యం చేయడంతో కాంగ్రెసు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే సొంత పార్టీపై అసహనంతో ఊగిపోయారు. వారిలో కొందరు, కాంగ్రెసుని వీడి, టిఆర్ఎస్లో చేరిపోయారు కూడా. అయితే తీరికగా […]
Tag: TRS
కొత్త జిల్లాలు దసరాకే పక్కా
తెలంగాణలో కొత్త జిల్లాలు దసరా నుంచి ఉనికిని చాటుకుంటాయని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రకటించారు. దసరా నాటికి కొత్త జిల్లాల ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలంటూ అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన కెసియార్, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సాక్షిగా కొత్త జిల్లాల ఉనికి దసరా నుంచి జరుగుతుందని ప్రకటించడం ఆయనలోని ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఎందుకంటే, కొత్త జిల్లాల పట్ల కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. కొత్త […]
మాట తప్పేది లేదంటున్న కెసియార్
ముస్లింలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషనుల ఇచ్చేందుకు ప్రత్యేక చట్టం తీసుకువస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్ పునరుద్ఘాటించారు. గతంలో ఇలాంటి ప్రయత్నం జరిగినా న్యాయస్థానాల్లో ఆ కేసులు వీగిపోయాయి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే అంశంలో వెనక్కి తగ్గేది లేదని ఇంకోసారి చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లను కల్పించడానికి ప్రత్యేక చట్టం తెస్తామని ఆయన అంటున్నారు. అయితే, ఎన్నికల్లో ఇచ్చిన ఈ హామీని నెరవేర్చడానికి రెండేళ్ళకుపైగానే కెసియార్ సమయం తీసుకున్నారు. […]
కెసియార్ టీడీపీని ఇలా కూడా దెబ్బకొడుతున్నారా?
గ్యాంగ్స్టర్ నయీం బతికొచ్చి ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పలేడు. పోలీసులు ఏం చెబితే అదే నిజం అనుకోవాలి. ప్రభుత్వం ఎలా చెబితే పోలీసులు అలా నివేదిక ఇస్తారు. ఇదీ విపక్షాల ఆరోపణ. గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ జరిగిన తరువాత పోలీసు, రాజకీయ వర్గాల్లో సునామీ మొదలైంది. ఈ సునామీలో ఎవరు కొట్టుకుపోతారో తెలియడంలేదు. పోలీసులు సేఫ్ అవ్వాలంటే అధికార పార్టీ చెప్పినట్లు పోలీసులు వ్యవహరించాలని హుకూం జారీ అయినట్లుగా పరిస్తుతులు కానవస్తున్నాయంటూ రాజకీయ వర్గాలలో […]
అటు ఐసిస్ ఇటు తెరాస మధ్యలో నయీం ఖల్లాస్
నయీం గ్యాంగ్ స్టర్.. ఎన్నో హత్యలు చేశాడు..ప్రతి వ్యవహారంలోనూ వేలుపెట్టి సెటిల్మెంట్లు …చడీచప్పుడు లేకుండా అత్యంత రహస్య ఆపరేషన్ తో తెల్లారేసరికి ఎన్ కౌంటర్ చేసి పడేశారు..చాలాకాలం పోలీసులకు ఇన్ఫార్మరుగా ఉంటూ… మావోయిస్టులను, పౌరహక్కుల నేతలనూ చంపిన నయీం ఒక్కసారిగా పోలీసులకు, ప్రభుత్వానికి ఎందుకు టార్గెట్ అయ్యాడు..? ఒకటి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో కొత్తగా సంబంధాలు పెట్టుకోవడం.. రెండు తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలను బెదిరించడం. రెండో కారణమే బలంగా వినిపిస్తున్నా, మొదటి కారణం కూడా ప్రభుత్వం తక్షణం […]
మరో మల్లన్నసాగర్ గా తయారవుతున్న ఫార్మా సిటీ…
ఫార్మాసిటీ…. తొలుత 6000 ఎకరాల్లో ఫార్మాసీటీకి ఊపిరి పోయాలని అనుకున్నా, కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలతో 12,500 ఎకరాలకు పెంచారు. ఈ ప్రాజెక్టుకు ఎన్డీయే సర్కారు జాతీయ పెట్టుబడి, తయారీ కేంద్రం హోదా సైతం మంజూరు చేసిందని టీఎస్ఐఐసీ అధికారులు అంటున్నారు.ఫార్మా సిటీ కోసం రంగారెడ్డి జిల్లా కందుకూరు, యాచారం మండలాలు, మహబూబ్నగర్ జిల్లా ఆమనగల్ మండలాల్లోని 19 గ్రామాల్లో ఇప్పటికే భూసేకరణకు శ్రీకారం చుట్టారు. అయితే కందుకూరు మండలం ముచ్చర్ల ప్రధాన కేంద్రంగా […]
ట్రబుల్ లో కెసిఆర్ డబుల్ బెడ్ రూమ్…
తెలంగాణ రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్లు ఇస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది.. శాంపుల్గా హైదరాబాద్లో కొన్ని ఇళ్లను చూపించింది.. వాటిని చూసిన ప్రజలు సర్కారుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికీ ఆ ఊహల్లోనే విహరిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మరో రకంగా ఉంది.. ఇళ్లను నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. గృహ నిర్మాణ శాఖ మంత్రి సొంత జిల్లా ఆదిలాబాద్లో అయితే ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. నాలుగు సార్లు టెండర్లు పిలిచినా […]
మోడీ కి తెరాస సత్తా చూపే టైమొచ్చింది
తెలంగాణ రాష్ట్ర సమితి కేంద్ర ప్రభుత్వానికి మరింత దగ్గరయ్యే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఇప్పటి వరకు అంశాల వారిగా మద్దతు ఉంటుందని ప్రకటనలు చేసిన గులాబి నేతలు… ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. భారీ జనసమీకరణలో తమకు సాటి లేదని నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 7న మొదటిసారి రాష్ట్ర పర్యటనకు రానున్నారు. మోదీ పాల్గోనున్న కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి […]
కెసిఆర్ కి సిసలైన సవాల్!
రెండేళ్ల నుంచి అన్ని విషయాల్లో పైచేయి సాధించిన టీఆర్ ఎస్ ప్రభుత్వం- ఎంసెట్ లీకేజీ, 8మంది వీసీల రద్దు తీర్పుతో ఇరుకునపడింది. ఎంసెట్ స్కాంతో ఓ పక్క గందరగోళం కొనసాగుతుండగానే 8మంది వీసీల నియామకాలు చెల్లవని హైకోర్టు తీర్పు ఇచ్చింది. వీటిని దెబ్బమీద దెబ్బగానే పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ప్రతిదీ నిశితంగా పరిశీలించి, నిఘాలతో ప్రభుత్వ వ్యవస్థను నడిపిస్తోన్న ప్రభుత్వం, ఎంసెట్ లీకేజీ అంశంలో దెబ్బతిన్నమాట నిజమేనని ఎమ్మెల్యేలు, నేతలు అంగీకరిస్తున్నారు. ఎంసెట్ కుంభకోణం లక్షలాది […]