అక్కడా కేసీర్ యే ముందున్నాడు

తెలంగాణ న్యాయవాదులు, జడ్జీలు, న్యాయాధికారులు చేస్తున్న ఉద్యమాన్ని అధికార, ప్రతిపక్ష పార్టీలు తమకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. ఈ విషయంలో అధికార టీఆర్ఎస్ ఒక అడుగు ముందుండగా, విపక్షాలు కాసింత వెనుకబడిపోయాయి. ఉమ్మడి హైకోర్టును విభజించాలని న్యాయవాదులు గత కొన్నాళ్లూగా ఆందోళనలు చేస్తున్నారు. హైకోర్టు విభజించకుండానే, జడ్జీలను, న్యాయాధికారుల కేటాయింపుల వల్ల స్వరాష్ట్ర సాధన అనంతరం కూడా తెలంగాణ వారికి అన్యాయం జరుగుతుందని దశలవారీగా వారు తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో […]

టీ కాంగ్రెస్ లో కోవర్టులు వున్నారా ?

అస‌లు తెలంగాణ‌ కాంగ్రెస్ పార్టీలో కోవ‌ర్టులు ఉన్నారా, ఈకోవ‌ర్టుల‌తో పార్టీకి న‌ష్టం జ‌రుగుతుందంటారా, ప్రస్తుత ప‌రిణామాలు చూస్తుంటే ఔన‌న్పిస్తోంది. కాంగ్రెస్ పెద్ద‌లు మాత్రం కోవ‌ర్ట‌ల‌తో పార్టీకీ తీవ్ర న‌ష్టం జ‌రుగుతంద‌ని, దీనిపై అధిష్టానం చోర‌వ తీసుకోవాల‌ని, లేకుంటే తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఖాతా క్లోజ్ ఆవుతుంద‌ని టీకాంగ్రెస్ లో కొంత‌మంది పెద్ద‌ల అధిష్టానం ముందు వాద‌న‌లు విన్పిస్తున్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి130ఏళ్ల రాజ‌కీయ‌ చ‌రిత్ర ఉందని, ఏంతోమంది నాయ‌కులను త‌యారు చేసింద‌ని, కాంగ్రెస్ పార్టీ స‌ముద్రం లాంటిద‌ని […]

మల్లన్న దెబ్బ కి అల్లాడుతున్న కేసీఆర్…

మల్లన్నసాగర్‌… ఈ పేరింటేనే ఇపుడు టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు గొంతపట్టేస్తోంది. జీవో 123 ప్రకరాం మంచినీళ్ల ప్రాయంగా భూములు సేకరిస్తున్న ప్రభుత్వానికి ‘ 2013 భూసేకరణచట్టం’ ఎక్కిళ్లు తెప్పిస్తోంది. ఇక ముందు సేకరించబోయే భూములతోపాటు.. ఇప్పటిదాకా సేకరించిన భూములకూ 2013 చట్టాన్నే వర్తింపజేయాల్సిన పరిస్థితి వచ్చింది. కుర్చీమీద కూర్చున్నది మొదలు… తనకు ఎదురేలేదన్నట్టు వ్యవహరిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి తొలిషాక్‌ మల్లన్నసాగర్‌ రూపంలో తగిలింది. తాము అనుకున్నదే చేస్తామని మొండిపట్టుదలకు పోయిన సర్కారు హైకోర్టులో మెత్తబడింది. నిర్వాసితుల కోరిన విధంగా […]

టి కాంగ్రెస్ కి భారమవుతున్న ఆ ఇద్దరు!

తెలంగాణ కాంగ్రెసు నాయకులు ఢిల్లీకి వెళ్ళి వస్తున్నారే తప్ప, తెలంగాణలో పార్టీని బాగు చేయలేకపోతున్నారు. రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే బాధ్యత ఆయా రాష్ట్రాల్లోని పార్టీ నాయకత్వాలదే. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెసు పార్టీకి నాయకత్వమే లేదు. అది విభజనతో జరిగిన నష్టం. తెలంగాణలో అలా కాదు కదా. తెలంగాణలో టిఆర్‌ఎస్‌ దెబ్బకి కాంగ్రెసు నాయకత్వం కుదేలైంది. ‘మేం తెలంగాణ ఇచ్చినా, మీరు పార్టీని బాగు చేయలేకపోతున్నారు’ అని తెలంగాణ నుంచి వెళ్ళిన ప్రతి నాయకుడికీ సోనియాగాంధీ తలంటు పోసేస్తున్నారట. […]

ఆ 12 మందితో కేసీర్ కి తలనొప్పే

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. పేరుకు మంత్రివర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా మొత్తం 18 మంది వున్నారు. ఇందులో నలుగురైదురు మినహా మిగిలిన వారు తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు. క్యాబినేట్‌లోని 18 మంది మంత్రుల్లో 12 మంది మంత్రుల తీరు మాత్రం ప్రశ్నార్థకంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి. తమ శాఖలపై పట్టు సాధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే చెప్తున్న వారు మాత్రం తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే వాదనలు […]

పులిచింతల పంచాయితీ షురూ

విడిపోయినా అన్నదమ్ములుగానే కలిసుందాం అన్నది ఒట్టి మాటే..లోలోపల రెండు తెలుగు రాష్ట్రాలు జల జగడాలతో సతమతమౌతున్నాయి.తెలాంగాణా వాటాలో చుక్కనీరు కూడా మాకు అవసరంలేదు అని ఆంద్రప్రదేశ్ చెప్తోంటే మాకు రావాల్సిన వాటాకు మించి మేము ఒక్క చుక్క నీటి బొట్టును కూడా తీసుకొం అని తెలంగాణా వాదిస్తోంది.మరి సమస్యేంటా అనుకుంటున్నారా,అదేనండి ఈగో అండి ఈగో..మేమెందుకు ఒప్పుకోవాలి..మేమెందుకు దిగిరావాలి..కుదిరిన కాడికి సమస్యస్యల్ని జటిలం చేసేసి ఎవరికి వారు హీరోలమైపోదామనే తప్ప రాష్ట్ర ప్రయోజానాగురించి ఆలోచించేదెవరు?ప్రజలమధ్య విద్వేషాల్ని రెచ్చగొట్టేద్దాం పబ్బం […]

శ్రీమంతుడు కోసం ఎదురు చూస్తున్న గ్రామస్తులు

శ్రీమంతుడు సినిమా తర్వాత మహేశ్ బాబు గ్రామాలను దత్తత తీసుకు న్నారు. తెలంగాణలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్న చాలాకాలం తర్వాత.. ప్రిన్స్ తరపున ఆయన సతీమణి హెల్త్ క్యాంపు నిర్వహించారు. త్వరలో మహేశ్‌బాబు గ్రామంలో పర్యటిస్తారని నమ్రత ప్రకటించడంతో గ్రామస్థులు ఆయన రాకకోసం ఎదురుచూస్తున్నారు.శ్రీమంతుడు సినిమాలో హీరో మహేశ్ బాబు తన స్వగ్రామానికి వెళ్లి అభివృద్ధి చేస్తాడు. గ్రామస్థులందరిలో స్ఫూర్తి నింపి ఆదర్శంగా నిలుస్తాడు. కేవలం సినిమాలోనే కాకుండా నిజజీవితంలోనూ వెనుకబడ్డ గ్రామాన్ని డెవలప్ చేయాలనుకున్నాడు […]

మల్లన్నకు పెరుగుతున్న మద్దతు

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో రెండేళ్ల తర్వాత ఓ ప్రజాఉద్యమం ఊపిరి పోసుకుంది. ఈ రెండేళ్లలో విపక్షాలు వివిధ అంశాలపై ఎన్ని ఆందోళనలు నిర్వహించినా లభించని మద్దతు, మల్లన్నసాగర్ భూసేకరణపై రైతులు చేస్తున్న ఉద్యమానికి లభించడం విశేషం. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లా ఏటిగడ్డకిష్టాపూర్, పల్లెపహాడ్, వేములగట్, తొగుట గ్రామాలను ముంచేలా నిర్మించనున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం గజం భూమి కూడా ఇచ్చేది లేదన్న నాలుగు గ్రామాల రైతులకు అనుకూలంగా విపక్షాలు, జాక్ చైర్మన్ […]

నీటి యుద్దాలు — కేంద్రం దొంగాట

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్దాలు కొనసాగుతున్నాయి. ఇరు తెలుగురాష్ట్రాల మధ్య నీటి సమస్య ను పరిష్కరించలేక కేంద్రం చేతులెత్తేసింది.ఇరు రాష్ట్రాల మధ్యనున్న నీటి సమస్య లను మీరే తేల్చుకోవాలని సూచించింది. కృష్ణా నీటి వాటాలు కొన్నాళ్ల పాటు యధాస్థితి లోనే కొనసాగుతాయని చెప్పింది. ఈ సమస్యకు పరిష్కారం లభించక పోవడం తో మరో నెల రోజుల పాటు గతసంవత్సరం లాగే నీటి వాటాలు ఉంటాయని తెలిపింది. ఈ లోగా రెండు రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు […]