ఏబీఎన్‌కు జ్ఞానం ఉందా… నంద్యాల‌లో బ‌తికున్న అధికారిని చంపేసింది

నంద్యాల- ఈ పేరు చెబితేనే చాలు రాష్ట్రంలోని ఓ మీడియా వ‌ర్గానికి ఎక్క‌డాలేని ఉలుకొచ్చేస్తోంద‌ట‌! అక్క‌డి వార్త‌ల‌ను క‌వ‌ర్ చేయ‌డం, ప్ర‌సారం చేయ‌డంలోనూ ఇలానే దుందుడుకు దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోందట‌. ముఖ్యంగా ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రారంభానికి ముందే ఈ మీడియా.. చాలా దుందుడుకు క‌థ‌నాలు ప్లే చేస్తోంద‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇక్క‌డ భూమా నాగిరెడ్డి మ‌ర‌ణంతో ఎన్నిక‌లు రావ‌డం, వైసీపీ కూడా బ‌రిలో నిల‌బ‌డ‌డంతో టీడీపీని స‌మ‌ర్ధించే ఏబీఎన్ చానెల్‌కు ఒక్క‌సారిగా టెన్ష‌న్‌తో కూడిన […]

నంద్యాల‌లో వైసీపీ గెలుపు ఆశ‌లు ఇవే

అవును! ఇప్పుడు ఆపార్టీ నంద్యాల ఉప పోరులో గ్రామాల‌పైనే ఆశ‌లు పెట్టుకుంది. ముఖ్యంగా గోస్పాడు వంటి అతి పెద్ద గ్రామాల‌ను టార్గెట్ చేసుకుని ఆ పార్టీ దూసుకుపోయింది. అదేవిధంగా జ‌గ‌న్ కూడా గ్రామాల్లోనే ప‌ర్య‌ట‌న ఎక్కువ‌గా చేశాడు. దీంతో జ‌గ‌న్ స‌హా అంద‌రూ ఇప్పుడు ఓటింగ్ స‌ర‌ళిపై చ‌ర్చిస్తూ.. త‌మ‌ను దీవించేదీ, అధికారం అప్ప‌గించేదీ ఒక్క గ్రామాలేన‌ని స్ప‌ష్ట‌త‌కు వ‌చ్చారు. ప‌ట్ట‌ణంలో ఎలాగూ టీడీపీ హావా స‌హా.. ప్ర‌భుత్వ అభివృద్ధి అజెండా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దీంతో ప‌ట్ట‌ణ […]

నంద్యాల‌లో ఆ ఓటింగ్ సానుభూతికా… వ‌్య‌తిరేకానికా..!

నంద్యాల‌లో పోలింగ్ ముగిసింది. ఓట‌రు తీర్పు ఎలా ఉంటుందో ?  ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. సాధార‌ణంగా ఉప ఎన్నిక అంటే ఓట‌ర్లు పెద్ద ఇంట్ర‌స్ట్ చూప‌రు. ఎవ‌రి ప‌నుల్లో వారు నిమ‌గ్నమైపోతారు. అయితే నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ మాత్రం సాధార‌ణ ఎన్నిక‌ల‌ను త‌ల‌పించేలా జ‌రిగింది. 80 శాతానికి కాస్త అటూ ఇటూగా పోలింగ్ న‌మోదైంది. ఓవ‌రాల్‌గా 79.20 శాతం పోలింగ్ జ‌రిగింది. 2014లో జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో 72.09 శాతం ఓటింగ్ న‌మోదు అయితే […]

సీమ పౌరుషం కోసం వైసీపీని గెలిపిస్తారా..!

రాయ‌ల‌సీమ వాసుల‌కు పౌరుషం ఎక్క‌వ‌… సీమ పౌరుషం సీమ‌వాళ్ల‌కు బాగా తెలిసినా మిగిలిన ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్ర‌జ‌లు సీమ నేప‌థ్యంలో వ‌చ్చిన సినిమాల్లో చూశారు. అక్క‌డ పంతాల‌కు, పౌరుషాల‌కు, ప‌గ‌ల‌కు ప‌ట్టింపులు ఎక్కువ‌. ముఖ్యంగా ఆత్మ‌గౌర‌వాన్ని తాక‌ట్టుపెట్టి బ‌తికేందుకు వారు అస్స‌లు ఇష్ట‌ప‌డ‌రు. సీమ‌లో చిత్తూరు మిన‌హా క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల్లో ఈ త‌ర‌హా సంస్కృతి ఎక్కువ‌. న‌మ్ముకున్న వాళ్ల కోసం వారు ఎంత‌కైనా వెళ‌తారు. దేనికైనా తెగిస్తారు. తాజాగా జ‌రిగిన నంద్యాల ఉప […]

అటు అభివృద్ధి.. ఇటు అన్యాయం.. నంద్యాల ఓట‌రు తిక‌మ‌క‌!

నంద్యాల ఉప ఎన్నిక మంచి ఊపుమీదుంది. గ‌తంలో ఎన్నిడూ లేనంత‌గా ఎన్నిక ప్రారంభం అయి రెండు గంట‌లు గ‌డిచాయో లేదో దాదాపు 16% పోలింగ్ న‌మోదైంది. అది కూడా ఓ ఉప ఎన్నిక‌లో కావ‌డంతో ఎన్నిక‌ల సంఘంలో త‌లు పండిన సీనియ‌ర్లు సైతం ఆశ్చ‌ర్య పోతున్నారు. ఇంత వెల్లువ‌లా నంద్యాల ఉప పోరు జ‌రుగుతుంద‌ని వారు అస్స‌లు ఊహించ‌లేదు. ఇంకో మ‌రింత ఆశ్చ‌ర్య‌క‌ర ప‌రిణామం ఏంటంటే.. మంచంలోంచి లేచి తిర‌గ‌లేని ప‌రిస్థితిలో కాటికి కాళ్లు చాపుకున్న వారు […]

నంద్యాల‌లో ఓట‌ర్ల‌ క్యూలే క్యూలు.. బాబు, జ‌గ‌న్‌కు టెన్ష‌న్‌… టెన్ష‌న్‌

నిన్ని మొన్న‌టి వ‌రకు అంద‌రూ రావాలి ఓటు హ‌క్కు వినియోగించుకావాలి.. అంటూ భారీ ఎత్తున రీసౌండ్ వ‌చ్చే మైకులు పెట్టుకుని మ‌రీ ఊరూ వాడా తిరుగుతూ నంద్యాల జ‌నాల చెవుల్ని హోరెత్తించిన టీడీపీ, వైసీపీల్లో తీరా ఇప్పుడు ఓటింగ్ మొద‌ల‌య్యే స‌రికి భ‌యం ప‌ట్టుకుంది! దీనికి కార‌ణం నంద్యాల ఓట‌ర్లే!! గ‌తంలో ఎన్న‌డూ క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో నంద్యాల ఓట‌ర్లు.. పోలింగ్ బూతుల ముందు క్యూల మీద క్యూలు క‌ట్టారు. పండు ముస‌లోళ్ల నుంచి యువ‌కులు, […]

జ‌గ‌న్‌పై కేసు న‌మోదుకు ఈసీ ఆదేశం

ఏపీ విప‌క్ష నేత‌గా బాధ్య‌తా యుత స్థానంలో ఉండి.. న‌లుగురికీ ఆద‌ర్శంగా రాజ‌కీయాలు చేయాల్సిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. నోటి దుర‌ద కార‌ణంగా కోరి క‌ష్టాలు కొని తెచ్చుకున్నారు. అది కూడా తాను ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న నంద్యాల ఉప పోరుకు ఎన్నిక జ‌రుగుతు స‌మయంలో కావ‌డంతో ఫ‌లితంపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. విష‌యంలోకి వెళ్తే.. నంద్యాల ఉప ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభించేందుకు ముందు టీడీపీలో క్రియాశీల‌కంగా ఉన్న శిల్పా బ్ర‌ద‌ర్స్‌ని వైసీపీలోకి ఆహ్వానించి టికెట్ […]

నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌ ..వైసీపీ వెర్ష‌న్ ఒకలా.. టీడీపీ వెర్ష‌న్ మ‌రోలా

తెలుగు జ‌నాలు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తోన్న  ఏపీలోని నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక పోలింగ్‌ బుధ‌వారం తీవ్ర ఉత్కంఠ మ‌ధ్ స్టార్ట్ అయ్యింది. ఉద‌యం 7 గంట‌ల‌కే ప్రారంభ‌మైన పోలింగ్ 10 గంట‌ల‌కే అన‌ధికారికంగా 22 శాతం వ‌ర‌కు పూర్త‌యిన‌ట్టు తెలుస్తోంది. నంద్యాల ఓట‌రు మంచి హుషారుగా త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు బూత్‌ల వ‌ద్ద బారులు తీరారు. ఇక నంద్యాల రూర‌ల్‌, గోస్పాడు మండ‌లాల్లో కొన్ని గ్రామాల్లో అయితే 10 గంట‌ల‌కే 40-50 […]

బాబు `ముంద‌స్తు` ప్ర‌ణాళిక తెలిస్తే షాకే!!

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం మాదే అంటే మాదే అని టీడీపీ, వైసీపీ ధీమాగా ఉన్నాయి. అంతేగాక ఎవ‌రికి ఎంత మెజారిటీ వ‌స్తుందో అని లెక్క‌లు కూడా వేసేసుకుంటున్నాయి. త‌న మూడేళ్ల పాల‌న‌కు ఈ ఎన్నిక‌ల్లో గెలుపే నిద‌ర్శ‌న‌మ‌ని భావించిన‌ టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నారు. ఇప్ప‌టికే టీడీపీకి 15 వేల మెజారిటీ వ‌రకూ వ‌స్తుంద‌ని అంత‌ర్గ‌త స‌ర్వేల్లో తేలింది. అది స‌రిపోద‌ని ఇంకా పెంచాల‌ని నేత‌ల‌ను ఆయన ఆదేశించ‌డం గ‌మ‌నిస్తే.. స‌రికొత్త వ్యూహంలో […]