సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి మోదీ ప్రసంగం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, నియంత్రణకు తీసుకున్న చర్యలు, లాక్‌డౌన్, వ్యాక్సినేషన్ ప్రక్రియ తదితర అంశాల గురించి ప్రధాని మోదీ మాట్లాడే అవకాశం ఉంది. చివరిసారిగా ఏప్రిల్ 20న ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా రెండో వేవ్ విజృంభణ క్రమంగా తగ్గుతుండటం, దేశంలో వ్యాక్సిన్ల కొరతపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో నేపథ్యంలో ప్రధాని ప్రసంగానికి ప్రాధాన్యత ఏర్పడింది. టీకాల కొరతను […]

కేంద్ర ప్రభుత్వం పై రాహుల్ ఫైర్…!?

దేశ భద్రతను మోదీ ప్రభుత్వం ప్రమాదంలో పడేస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. చైనాతో వారు జరిపే చర్చలు శుద్ధ దండగ అని ఆయన వ్యాఖ్యానించారు. గోగ్రా, డెస్పాంగ్ ప్రాంతాల్లో చైనా ఆక్రమణలు భారత వ్యూహాత్మక ప్రయోజనాలకు పెను సవాల్ గా మారాయని రాహుల్ అన్నారు. డ్రాగన్ తో జరిపే చర్చలతో దేశ భద్రత ఆందోళనకరంగా మారిందని సోమవారం నాడు రాహుల్ ట్వీట్ చేశారు. తూర్పు లడఖ్ లోని హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, డెస్సాంగ్ ప్రాంతాల […]

మోడీ మార్క్‌.. బాబును తొక్కి పెడుతున్నారా

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అంటే సామాన్యుడు కారు! అని ఆయ‌న గురించి తెలిసిన వాళ్లు ప‌దే ప‌దే చెబుతుంటారు. గుజ‌రాత్‌ను పాలించిన స‌మ‌యంలో ఇష్ర‌త్ జ‌హాన్ కేసును తిర‌గ‌తోడిన కార‌ణంగా ఆ రాష్ట్రానికి చెందిన ఓ న్యాయ‌మూర్తికే మోడీ వాత పెట్టారు. పోలీసు అధికారుల‌ను శంక‌రగిరి మాన్యాలు ప‌ట్టించారు. అలాంటి మోడీ ఇప్పుడు ఏపీ సీఎం చంద్ర‌బాబు మాట వింటార‌ని, బాబు చెప్పిన‌ట్టు న‌డుచుకుంటార‌ని అనుకోవ‌డం భ్ర‌మేన‌ని చెబుతున్నారు. తాజాగా జ‌రిగిన, జ‌రుగుత‌న్న ప‌రిణామాలు ఈ విష‌యాన్నే […]

మూడేళ్ల పాలనలో మోడీ విఫలమా ? సఫలమా?

  అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశం భార‌త్‌కు ప్ర‌ధాని ప‌ద‌వి అతి పెద్దది! ఈ దేశం మొత్తాన్ని పాలించ‌గ‌లిగిన ఏకైక ప‌ద‌వి ఇదే. అంత‌పెద్ద ప‌ద‌విని చేప‌ట్టి.. బీజేపీ సీనియ‌ర్ నేత న‌రేంద్ర మోడీకి మూడేళ్లు పూర్త‌య్యాయి. మ‌రో ఏడాదిన్న‌ర‌లోనే సార్వ‌త్రిక స‌మ‌రం సిద్ధం కానుంది. ఈ క్ర‌మంలో ఈ మూడేళ్ల పాల‌న‌ను త‌ర‌చి చూస్తే.. స్థూలంగా మోడీ ఈ దేశ ప్ర‌జ‌ల‌కు చేసింది ఏమిటి?  ఆయ‌న ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాలు స‌ఫ‌ల‌మ‌య్యాయా?  ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు […]

బీజేపీ ఆట క‌ట్టించేందుకు బాబు న‌యా గేమ్‌..!

ఇటీవ‌ల కాలంలో కేంద్రంలోని బీజేపీపై టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు గ‌ళం విప్పుతున్నారు. రాష్ట్రానికి బీజేపీ ఏమీ చేయ‌లేక‌పోతోంది_ అంటూ కామెంట్లు కుమ్మ‌రిస్తున్నారు. అయితే, కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక ఈ రేంజ్‌లో బాబు రెచ్చిపోయిన సంద‌ర్భాలు పెద్ద‌గాలేవు. నిజానికి ప్ర‌త్యేక హోదా విష‌యంలోనే బాబు కేంద్రంతో గొడ‌వ పెట్టుకుంటార‌ని అనుక‌న్నారు. అయితే, అనూహ్యంగా ఆయ‌న ప్యాకేజీ ఇచ్చినా స‌ర్దుకు పోయారు. అదేస‌మ‌యంలో పోల‌వ‌రం విష‌యంలోనూ కేంద్రం నిదులు స‌క్ర‌మంగా ఇవ్వ‌లేక‌పోతున్నా బాబు నిన్నమొన్న‌టి వ‌ర‌కు పెద్దగా విమ‌ర్శించి […]

బాబు భ‌య‌ప‌డుతున్నారా..? బాబుకు ఎందుకు భ‌యం..?

అవును! బాబు భ‌య‌ప‌డుతున్నారా?  ఆయ‌న‌కు ఎందుకు భ‌యం? ఇప్పుడు ఇవే ప్ర‌శ్న‌లు ఏపీ ప్ర‌జ‌ల‌నే కాదు, ఉన్న‌త‌స్థాయి అధికారుల‌ను సైతం వేధిస్తున్నాయి. ఏ చిన్న తేడా వ‌చ్చినా సొంత అన్న‌ద‌మ్ములే.. త‌గువులు పెట్టుకుని న్యాయ పోరాటానికి దిగుతున్న రోజులు ఇవి! మ‌రి అలాంటిది విశాల జ‌న హితం ముడిప‌డిన ఏపీకి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, నీళ్లు వంటి వాటి విష‌యంలో బాబు ఎందుకు ఉదాసీన వైఖ‌రిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు మిత్ర‌ప‌క్షం అంటే […]

ఏపీ కూట‌మి ప్ర‌భుత్వంలో ఏం జ‌రుగుతోంది!

ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన పార్టీల‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ పార్టీల‌కు సంబంధించి నేత‌లు ఒక్కొక్క‌రు ఒకే విధంగా కామెంట్లు కుమ్మ‌రిస్తున్నారు. పొత్తుల‌పై ఇప్ప‌టి నుంచే నేత‌లు పెద్ద పెద్ద చ‌ర్చ‌లు కూడా చేప‌ట్టారు. మొత్తంగా ఈ కూట‌మి పార్టీల్లో ఏం జ‌రుగుతోంది అనే వార్త‌లైతే పెద్ద ఎత్తున వ‌స్తున్నాయి.  బీజేపీతో పొత్తు వద్దంటే వద్దని టీడీపీ నేత‌లు చెబుతున్నార‌ట‌. ఇక‌, టీడీపీతో పొత్తు వ‌ద్ద‌ని ఇప్ప‌టికే బీజేపీ నేత‌లు కూడా పెద్ద ఎత్తున […]

మోసం గురూ.. మోడీ ఎంత ప‌నిచేశాడు!

పాలిటిక్స్‌లో ఆరితేరిన వారు ఎలా ఉంటారో చూపించాలంటే.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఫొటో చూపిస్తే స‌రిపోతుంది! అని మొన్నామ‌ధ్య బిహార్ మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ చెప్పుకొచ్చారు. ఆయ‌న అలా అన్నప్పుడు స‌హ‌జంగానే ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టి.. త‌మ పార్టీని గ‌ద్దె నెక్కించిన నేప‌థ్యంలో లాలూ అలా కామెంట్ చేసి ఉంటాడ‌ని అంద‌రూ అనుకున్నారు. సాధార‌ణంగా తెలుగు వాళ్ల‌కు జాలి ఎక్కువ‌. చాలా విష‌యాల్లో క్ష‌మించేసుకుంటూ పోతుంటారు. అలాంటి తెలుగు వారికి సైతం ఇప్పుడు మోడీ పేరెత్తితే […]

మోడీ-ప‌వ‌న్ దూరంపై చంద్ర‌బాబు టెన్ష‌న్‌

2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఒక‌వైపు మోడీని.. మ‌రోవైపు ప‌వ‌న్‌ను పెట్టుకుని నెట్టుకొచ్చేశారు టీడీపీ అధినేత చంద్ర బాబు! అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా బీజేపీతో దోస్తీ.. జ‌నసేన‌తో మైత్రి.. కొన‌సాగిస్తూ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తూ వ‌స్తున్నారు. ఇప్పుడు మారిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో.. మిత్రుల మ‌ధ్య దూరం పెర‌గడం ఆయ‌న్ను తీవ్రంగా ఇబ్బందుల‌కు గురిచేస్తోంద‌ట‌. ముఖ్యంగా బీజేపీ-జ‌న‌సేన మ‌ధ్య గ్యాప్ వ‌ల్ల‌.. టీడీపీ శ్రేణుల్లో ఆందోళ‌న మొద‌లైంద‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీతో దోస్తీ త‌ప్ప‌దు.. అలాఅని జ‌న‌సేన‌తోనూ వైరం […]