టాలీవుడ్ సైపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి. ఈ చిత్రంలో మహేష్కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టీజర్కు సంబంధించి ఓ క్రేజీ […]
Tag: Latest news
భారత్లో కరోనా టెర్రర్..3 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్లో 3,14,835 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,59,30,965 కు చేరుకుంది. అలాగే నిన్న 2,104 మంది […]
తెలంగాణలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..పెరిగిన మరణాలు!
చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలోనూ నిన్న ఐదు వేలకు చేరువలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం..కరోనాతో పెద్ద కుమారుడు మృతి!
కంటికి కనిపించకుండా ఎందరో ప్రాణాలను బలి తీసుకున్న ప్రాణాంతక కరోనా వైరస్.. సెకెండ్ వేవ్లో మరింత వేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యులనే కాదు.. సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు ఇలా అందరిపై కరోనా పంజా విసురుతోంది. తాజాగా సీపీఎం సీనియర్ నేత, ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట్లో కరోనా తీవ్ర విషాదాన్ని నింపింది. కరోనాతో ఆయన పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కన్నుముూశారు. 34 ఏళ్ల వయసున్న ఆయనకు కొన్ని రోజుల క్రితం కరోనా సోకగా.. […]
`పుష్ప` సెట్లో అనసూయ..యాంకరమ్మ పోస్ట్ వైరల్!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 13న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ కూడా […]
మళ్ళీ యుద్ధం చేద్దాం..ప్రజలను అలర్ట్ చేసిన మహేష్!
ఎక్కడో చైనాలో పుట్టుకొచ్చిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను అల్లకల్లోలం చేస్తోంది. వైరస్ ప్రభావం తగ్గుతుంది అని అందరూ అనుకునే లోపే మళ్లీ శర వేగంగా విజృంభిస్తోంది. ప్రస్తుతం దేశంలో రోజుకు రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి తరుణంలో కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సినీ తారలు ప్రజలను కోరుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు […]
సెల్ఫ్ క్వారెంటైన్లోకి ప్రభాస్..ఆందోళనలో ఫ్యాన్స్?!
ప్రస్తుతం కరోనా వైరస్ వీర లెవల్లో వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ పంపిణీ జోరుగా కొనసాగుతున్నా.. కరోనా ఉదృతి ఏ మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలోనే సామాన్యులతో పాటు ఎంతో జాగ్రత్తగా ఉండే సెలబ్రెటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ఎందరో సినీ తారలకు కరోనా సోకగా.. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ సెల్ఫ్ క్వారెంటైన్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న చిత్రాల్లో `రాధేశ్యామ్` ఒకటి. ఈ సినిమా షూటింగ్ చివరి […]
రేటు భారీగా పెంచేసిన `ఉప్పెన` డైరెక్టర్..ఇప్పుడిదే హాట్టాపిక్?
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్గా తెరకెక్కిన తాజా చిత్రం `ఉప్పెన`. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రం ద్వారా డైరెక్టర్గా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. మొదటి చిత్రంతోనే సూపర్ డూపర్ హిట్ అందుకుని అందరి చూపులను తనవైపు తిప్పుకున్నాడు బుచ్చిబాబు. భారీ లాభాలు రావడంతో ఉప్పెన నిర్మాతలు బుచ్చిబాబుకు ఒక బెంజ్ కారును గిఫ్ట్గా ఇచ్చారు. అంతేకాదు తమ బ్యానర్లో మరో సినిమా చేసే అవకాశం ఇచ్చారు మైత్రి మూవీ […]
కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం!
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కిషన్రెడ్డి పెద్దన్నయ్య యాదగిరి రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్లోని తన నివాసంలో బుధవారం రాత్రి తుది శ్వాస్ విడిచారు. ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రి కిషన్రెడ్డి తిమ్మాపూర్ చేరుకున్నారు. మరోవైపు పలువురు బీజేపీ నాయకులు యాదగిరి రెడ్డి మృతిపై సంతాపం వ్యాక్తం చేస్తున్నారు. […]