లోకేష్ ‘యువగళం’ రెడీ..టీడీపీకి కలిసొస్తుందా?

మొత్తానికి లోకేష్ యువగళం పాదయాత్రకు అన్నీ ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి..జనవరి 27 తేదీన ఉదయం 11 గంటలకు కుప్పంలో లోకేష్ పాదయాత్ర మొదలుకానుంది. పోలీసులు పలు ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో పాదయాత్ర ఎలా సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే పోలీసుల ఆంక్షలని పట్టించుకోకుండా టి‌డి‌పి శ్రేణులు పాదయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇటు లోకేష్ సైతం అదే దూకుడుతో ముందుకెళుతున్నారు. బుధవారం ఇంటిదగ్గర చంద్రబాబు, భువనేశ్వరి ఆశీర్వాదం తీసుకుని, ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్ళి, ఆ తర్వాత కడపకు వెళ్ళి […]

బాబుకు మైలేజ్ పెంచేస్తున్నారా..కుప్పంలో తమ్ముళ్ళు తగ్గలేదు.!

మొత్తానికి జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో..కుప్పంలో టీడీపీ శ్రేణులని నిలువరించలేకపోయింది..వరుసగా కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోవడంతో..ఇకపై రోడ్లపై సభలు, ర్యాలీలు చేయకూడదని ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. పోలీసులు అనుమతించిన ప్రదేశాల్లోనే సభలు పెట్టుకోవాలని సూచించారు. అయితే నెల క్రితమే చంద్రబాబు కుప్పం టూర్ షెడ్యూల్ అయింది. దీంతో తాజాగా బాబు కుప్పంకు వచ్చారు..కానీ అడుగడుగున కుప్పంలో టీడీపీ శ్రేణులని పోలీసులు అడ్డుకున్నారు. ప్రచార వాహనాన్ని సీజ్ చేశారు. రచ్చబండ స్టేజిని తీసేశారు. […]

బాబుకు కుప్పం టెన్షన్..మరోసారి టూర్.!

అసలు ఎన్నికల సమయంలో నామినేషన్ వేయడానికి వెళ్లకుండా..టీడీపీ నేతల చేత తన నామినేషన్ వేయించి..కుప్పంలో వరుసగా గెలుస్తూ వస్తున్న చంద్రబాబుని..పదే పదే కుప్పం వెళ్ళేలా అధికార వైసీపీ చేసిన విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గా వైసీపీ ఎలాంటి రాజకీయాలు చేస్తూ వచ్చిందో చెప్పాల్సిన పని లేదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..కేవలం కుప్పంపై ఫోకస్ చేసి..అక్కడ టీడీపీని దెబ్బతీసేలా స్కెచ్ లు వేస్తూ వచ్చారు. చాలావరకు టీడీపీ నేతలని వైసీపీలోకి […]

బాబుకు సీటు ఫిక్స్ చేసిన పెద్దిరెడ్డి..కుప్పం వదిలేసినట్లే!

టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట కుప్పంపై వైసీపీ ఏ స్థాయిలో ఫోకస్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పంలో బాబుని దెబ్బతీయడమే లక్ష్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పనిచేస్తూ వస్తున్నారు. అక్కడ బెదిరింపులతోనో..పథకాలు పోతాయని భయం తెప్పించడమో..లేక పలు రకాలుగా అధికార బలాన్ని ఉపయోగించుకుని..కుప్పంలో కొంతమంది టీడీపీ శ్రేణులని వైసీపీ వైపుకు తీసుకొచ్చారు. అలాగే పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వన్ సైడ్‌గా గెలిచారు..కుప్పం మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకున్నారు. అయితే […]

కుప్పంలో టీడీపీకి వైసీపీ ట్రైనింగ్..?

వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాజకీయంగా కుప్పం పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే. గతంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలో లేక ఇతర ప్రోగ్రాంలు జరిగినప్పుడు మాత్రమే వార్తల్లో కుప్పం పేరు వినిపించేది. కానీ రాజకీయంగా రచ్చ జరిగినట్టు ఎప్పుడు వినబడలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక..కుప్పంలో రాజకీయంగా పై చేయి సాధించాలని డిసైడ్ అయిన దగ్గర నుంచి అక్కడ రచ్చ నడుస్తోంది. ప్రశాంతంగా ఉండే కుప్పంలో రాజకీయ యుద్ధం నడుస్తోంది. అలాగే అధికార వైసీపీ అన్నీ రకాలుగా […]

బాబుకు రెండు సీట్లు ఫిక్స్ చేసిన వైసీపీ.!

వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు కంచుకోట అయిన కుప్పం నియోజకవర్గంని ఏ స్థాయిలో టార్గెట్ చేశారో చెప్పాల్సిన పని లేదు. ఎలాగైనా కుప్పంని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వైసీపీ ముందుకెళుతుంది. ఇక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో తెలియదు గాని..ఆయన కేవలం కుప్పంపై ఫోకస్ పెట్టి..అక్కడ టీడీపీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కుప్పంలో వైసీపీ బలం పెంచడంలో సక్సెస్ అయ్యారు. పంచాయితీ, పరిషత్, కుప్పం మున్సిపాలిటీలో […]

మళ్ళీ మొదలు…బాబు సీటు చేంజ్..!

ఎప్పుడైతే కుప్పం లో పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వైసీపీ వన్ సైడ్ గా గెలవడమే కాకుండా..కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకుందో అప్పటినుంచి..కుప్పంలో చంద్రబాబు ఈ సారి గెలిచే అవకాశాలు లేవని, ఇంకా ఆయన పని అయిపోయిందని చెప్పి వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఈ సారి కుప్పంలో బాబుని చిత్తుగా ఓడిస్తామని అంటున్నారు. అయితే ఏదేమైనా గాని వైసీపీ వల్ల కుప్పంలో బాబుకు కాస్త డ్యామేజ్ అయిన మాట వాస్తవం. అందుకే బాబు వెంటనే […]

లోకల్-నాన్ లోకల్..కుప్పం కోట కూలుతుందా?

జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు కంచుకోట కుప్పంని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. అక్కడ వైసీపీ పాగా వేయడమే లక్ష్యంగా రాజకీయం చేస్తూ వచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేకంగా కుప్పంపై ఫోకస్ చేసి టీడీపీని దెబ్బతీయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే కుప్పంలో కొంతవరకు టీడీపీ శ్రేణులని వైసీపీలోకి తీసుకొచ్చారు..అటు స్థానిక ఎన్నికల్లో వైసీపీ అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది..కుప్పం మున్సిపాలిటీని గెలుచుకుంది. దీంతో చంద్రబాబు పని అయిపోయిందని వైసీపీ శ్రేణులౌ ప్రచారం […]

టార్గెట్ కుప్పం: వైసీపీలో ‘టీడీపీ’..!

కుప్పం అంటే చంద్రబాబు కంచుకోట అని అందరికీ తెలుసు..వరుసపెట్టి ఏడు పర్యాయాలు బాబు అక్కడ విజయం సాధిస్తూ వస్తున్నారు. కానీ ఈ సారి మాత్రం కుప్పంలో బాబుకు ఖచ్చితంగా చెక్ పెట్టాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గానే రాజకీయం నడిపిస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడే మకాం వేసి..టీడీపీని దెబ్బ తీయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఇప్పటికే కుప్పంలో పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వన్ సైడ్ గా గెలిచారు. కుప్పం మున్సిపాలిటీని […]