ఎన్టీఆర్ టూ వైఎస్సార్..ఒరిగేది ఏంటి?

ఏదేమైనా సంచనల నిర్ణయాలు తీసుకోవడంలో జగన్ ప్రభుత్వానికి  సాటి లేదనే పరిస్తితి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలతో ముందుకొస్తారో ఎవరికి అర్ధం కాదు. ఇక ఆ నిర్ణయాలు ఒకోసారి బాగానే ఉంటాయి..ఒకోసారి మాత్రం వివాదాస్పదం అవుతాయి. ఉదాహరణకు మూడు రాజధానుల నిర్ణయం లాంటిది. ఇలాంటి సంచలన నిర్ణయాలు జగన్ చాలానే తీసుకున్నారు. తాజాగా కూడా జగన్ ఊహించని నిర్ణయం ఒకటి తీసుకున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని..వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చేశారు. […]

ఏపీలో అసెంబ్లీ స్థానాలు పెరిగితే ఆ పార్టీకే లాభ‌మా…!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాల‌ను పెంచాల‌ని కోరుతూ.. సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లైం ది. తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న హామీ చ‌ట్టంలోనే అసెంబ్లీ సీట్ల పెంపును పేర్కొన్నార‌ని.. పిటిష‌న్‌లో తెలిపారు. కాబ‌ట్టి.. ఏపీలో 225, తెలంగాణ‌లో 119 నుంచి 153కి పెంచాలని రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌ 26లో ఉందని, కానీ, ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ప్రక్రియను మొదలు పెట్టలేదని పిటిషనర్ వివరించారు. అంతేకాదు.. జమ్ము కశ్మీర్‌ రాష్ట్ర విభజన చట్టంలో […]

జ‌నాలు గ‌మ‌నిస్తున్నారు.. జ‌గ‌న్ ఆ విష‌యంలో మారాలా…!

మ‌నం ఏం చెప్పినా.. చెల్లుతుందిలే! అని అనుకునే రోజులు రాజ‌కీయ నేత‌ల‌కు ఎప్పుడో పోయాయి. ఎందుకంటే.. సోష‌ల్ మీడియా ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు బాగా చేరువైంది. దీంతో నాయ‌కులు ఏం చేసినా.. వారు ఏం చెప్పినా.. ప్ర‌జ‌లు ఒక‌టికి రెండు సార్లు గ‌తంలోకి వెళ్లి.. స‌రిచూసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ప్ర‌స్తావ‌న ఎందుకు వ‌స్తోందంటే.. వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్‌.. త‌న ప్ర‌భుత్వ‌మే అన్నీ చేస్తోంద‌నే వాద‌న‌ను తెర‌మీదికి తెచ్చారు. అస‌లు సంక్షేమం అంటే.. ఇదీ.. ఇలా ఉండాలి.. అని […]

జగన్‌కు ‘ఈనాడు’ కౌంటర్లు..!

రాష్ట్రంలో మీడియా సంస్థలు గాని, పత్రిక సంస్థలు గాని..రాజకీయ పార్టీలకు అనుకూలంగా మారిపోయిన విషయం తెలిసిందే. ప్రధాన పార్టీలకు బాకా ఊదే సొంత మీడియా సంస్థలు ఎక్కువ అయిపోయాయి. అధికార వైసీపీకి సొంత మీడియా సంస్థతో పాటు..అనుకూల మీడియా సంస్థలు చాలానే ఉన్నాయి…వీటిని బ్లూ మీడియా అని టీడీపీ విమర్శిస్తుంటుంది. అటు టీడీపీకి అనుకూల మీడియా సంస్థలు ఉన్నాయి. వీటిని యెల్లో మీడియా అని వైసీపీ విమర్శిస్తుంటుంది. పైగా ఆ చానల్స్ ఏవో, పత్రికలు ఏవో జగన్‌తో […]

 వై నాట్ 175: ఫస్ట్ టార్గెట్ కుప్పం..!

ఆ మధ్య వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ వర్క్ షాప్ నిర్వహిస్తూ..కుప్పంలోని పంచాయితీలు, పరిషత్‌లు, కుప్పం మున్సిపాలిటీని కూడా గెలుచుకున్నాం కదా..ఇక కుప్పం అసెంబ్లీని కూడా గెలుచుకుంటాం..అలాంటప్పుడు 175కి 175 సీట్లు ఎందుకు గెలుచుకోలేము అని చెప్పి..ఎమ్మెల్యేలని ప్రశ్నించారు. అంటే 175కి 175 సీట్లు టార్గెట్ అప్పటినుంచి పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకున్నాం..ఈ సారి 175 సీట్లు గెలిచేయాలని అంటున్నారు. సరే ఈ టార్గెట్ రీచ్ అవుతారా? లేదా అనేది పక్కన పెడితే..ముందు కుప్పంపై మాత్రం […]

‘మూడు’తోనే రాజకీయం..జగన్ ప్లాన్ అదే..!

జగన్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే వెంటనే ఆ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించుకున్నారు. కానీ మండలిలో అప్పుడు టీడీపీకి మెజారిటీ ఉండటంతో అక్కడ పాస్ అవ్వలేదు. ఇక దీనిపై అమరావతి రైతులు, టీడీపీ పెద్ద ఎత్తున పోరాటాలు చేసుకుంటూ వచ్చిన విషయం తెలిసిందే. అలాగే న్యాయ పోరాటాలు చేశారు. ఇదే క్రమంలో కోర్టులో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తీర్పులు వచ్చాయి. ఫైనల్ గా మూడు రాజధానుల […]

జగన్ కొత్త ఎత్తు..ఆ సిట్టింగులకు చెక్?

అగ్రెసివ్‌గా రాజకీయాలు చేయడంలో జగన్ మించిన వారు లేరనే చెప్పాలి. ఏ అంశంలోనైనా జగన్ దూకుడుగానే ముందుకెళ్తారు. నిర్ణయాలు తీసుకోవడమైన, ప్రతిపక్ష పార్టీలకు చెక్ పెట్టే విషయంలోనైనా జగన్ రాజకీయ విధానమే వేరు. డేరింగ్ డ్యాషింగ్ నిర్ణయాలు తీసుకుంటారు. అయితే అలాంటి డేరింగ్ ఉన్న జగన్…తమ సొంత పార్టీలో వ్యతిరేకత ఎదురుకుంటున్న ఎమ్మెల్యేల విషయంలో జగన్ కాస్త ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. గత కొంతకాలంగా వైసీపీలో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందని, వారికి మళ్ళీ […]

జ‌గ‌న్ వ‌ర్సెస్ కేసీఆర్‌.. ఆ విష‌యంలో ఒక్క‌టైపోయారా…!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. కేంద్రంపై దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కేం ద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారును గ‌ద్దె దింప‌డ‌మే ల‌క్ష్యంగా ఆయ‌న అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మం లో వివిధ రాష్ట్రాల్లోని బీజేపీయేత‌ర ప్రాంతీయ ప్రార్టీను కేసీఆర్ ఏకం చేస్తున్నారు. ఎక్క‌డెక్క‌డికో వెళ్లి ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, మాజీ ముఖ్య‌మంత్రుల‌ను క‌లుస్తున్నారు. వారితో చ‌ర్చిస్తున్నారు. అయితే.. పొరుగునే ఉన్న ఏపీ విష‌యానికి వ‌స్తే.. కేసీఆర్ క‌నీసం ప‌న్నెత్తు మాట కూడా మాట్లాడ‌డం లేదు. ఏపీలో […]

కుప్పంలో మళ్ళీ అదిరిపోయే షాక్!

జగన్…చంద్రబాబు కంచుకోట కుప్పంని వదిలేలా లేరు. ఎలాగైనా ఈ సారి అక్కడ ఖచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గానే వైసీపీ రాజకీయం ఉంది. ఈ స్థానంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి అక్కడ చంద్రబాబు బలం తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో అక్కడ బలమైన టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలని వైసీపీలోకి తీసుకొచ్చారు. కార్యకర్తలని లాగేశారు. ఇక పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వన్ […]