ఢిల్లీ లో భారీ అగ్నిప్రమాదం…!

ఈ మ‌ధ్య చాలా అగ్ని ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. ఈరోజు దేశ రాజధాని అయిన న్యూఢిల్లీలోని లజపత్ నగర్ మార్కెట్లో భారీ అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ షోరూమ్‌లో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో మంటలను ఆర్పేందుకు వెంట‌నే అక్క‌డికి 30 అగ్నిమాపక వాహ‌నాలు వ‌చ్చాయి. అగ్నిమాపక శాఖ అధికారులు మంట‌లు ఆర్పేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. వారు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. లజపత్ నగర్ సెంట్రల్ మార్కెట్లో బ్లాక్ 1 వద్ద ఈ ఈరోజు ఒక్క‌సారిగా మంట‌లు […]

నేడు ఢిల్లీకి సీఎం జ‌గ‌న్‌..అమిత్ షాతో భేటీ అందుకేన‌ట‌?!

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రేడు ఢిల్లీ వెళ్ల‌నున్నారు. ఈ రోజు పదిన్నర గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో జగన్ బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు ఢిల్లీలోకి చేరుకుంటారు. ఆ తర్వాత వరుసగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. రాత్రి 9 గంటలకు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అవుతారు. మూడు రాజధానుల ఏర్పాటుకు సహకారం కోరడంతోపాటు, పోలవరం ప్రాజెక్టు బకాయిల విడుదలపై జలశక్తి మంత్రితో సీఎం చర్చించనున్నారు. అలాగే కరోనా […]

బ్రేకింగ్ : రెజ్లర్ సుశీల్​ కుమార్​ కు ​నోటీసులు.

ఇటీవల ఛత్రశాల్​ స్టేడియంలో జరిగిన వివాదంలో సాగర్​ రానా అనే మల్లయోధుడు మృతి చెందిన సంగతి అందరికి విదితమే . ఈ మర్డర్​ కేసులో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ రెజ్లర్​ సుశీల్​ కుమార్​కు ఢిల్లీ పోలీసులు తాజాగా లుక్​ఔట్​ నోటీసులు జారీచేశారు. ఛత్రసాల్​ స్టేడియంలో సాగర్​ రానా అనే మల్లయోధుడి పై జరిగిన హత్యకి సుశీల్​కు సంబంధాలున్నట్లు పోలీసులు గ్రహించడంతో ​ సుశీల్​ కుమార్​కు లుక్​ ఔట్​ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. కేసు లో […]

కోవిడ్‌పై పోరు..భారీ విరాళం ప్ర‌క‌టించిన‌ అమితాబ్‌!

సెకెండ్ వేవ్‌లో విరుచుకు ప‌డుతున్న క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ ప్రజ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు కంటి క‌నుకు లేకుండా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌తి రోజు ల‌క్ష‌ల సంఖ్య పాజిటివ్ కేసులు, వేల సంఖ్య మ‌ర‌ణాలు న‌మోదు అవుతున్నాయి. స‌రైన స‌దుపాయాలు లేకే చాలా మంది మృత్యువాత ప‌డుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో క‌రోనా బాధితుల‌ను ఆదుకునేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు ముందుకు వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌..ఢిల్లీలోని రాకబ్ గంజ్‌ ప్రాంతంలోని గురుద్వారా […]

అక్కడ లాక్‌డౌన్ పొడిగింపు…?

కరోనాను కట్టడి చేసేందుకు వీకెండ్ లాక్ డౌన్ విధిస్తున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ గత వారం ప్రకటించారు. గొలుసుకట్టు వ్యాప్తిని నిరోధించేందుకు ఇది అవసరమన్నారు. ఆడిటోరియం‌లు, రెస్టారెంట్లు, మాల్స్, వ్యాయామశాలలు మూసి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. సినిమా థియేటర్ల సీటింగ్ సామర్థ్యంలో కేవలం 30 శాతం మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతిస్తామని కూడా ఆయన తెలిపారు. కాగా.. శుక్రవారం నాడు ఢిల్లీ పాజిటివిటీ రేటు అనూహ్యంగా 24 శాతానికి చేరుకుంది. ఇది ఢిల్లీ ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి […]

ఇక్క‌డ ప‌వ‌న్‌.. అక్క‌డ ర‌జ‌నీ.. అజెండా ఒక్క‌టే!!

ప‌వ‌న్‌.. ర‌జ‌నీ.. ఇప్పుడు పొలిటిక‌ల్‌గా వీరి పేర్లు మార్మోగుతున్నాయి. తెలుగు నాట ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్ప‌టికే జ‌న‌సేన పార్టీని స్థాపించ‌డంతోపాటు 2019లో ప్ర‌జాక్షేత్రంలో అడుగు పెడ‌తాన‌ని చెప్పాడు. అంతేకాదు, తాను, త‌న పార్టీ పుట్టింది ప్ర‌శ్నించ‌డానికేన‌ని వెల్ల‌డించాడు. ఇక‌, త‌మిళ‌నాట‌.. సూప‌ర్ స్టార్ ర‌జనీ కూడా పొలిటిక‌ల్ ఫీల్డ్‌లోకి అడుగు పెడుతున్నారు. అయితే, వీరిద్ద‌రి గురించి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టింగ్‌లు వ‌స్తున్నాయి. అలాగే వేల‌ల్లో కామెంట్లు కూడా కురుస్తున్నాయి. నిజానికి వీరిద్ద‌రూ భాష‌ల […]

రైతుల‌కు బేడీలు.. దిగొచ్చిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ‌లో పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు కార‌ణ‌మైన ఖ‌మ్మం రైతుల‌కు బేడీల వ్య‌వ‌హారంపై సీఎం కేసీఆర్ త‌న‌దైన శైలిలో స్పందించారు. త‌న‌ను తాను ఆత్మ ర‌క్ష‌ణ‌లో ప‌డేసుకున్న ఈ వ్య‌వ‌హారం నుంచి చాలా సున్నితంగా త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశారు. రైతుల‌కు బేడీలు వేయ‌డాన్ని కేసీఆర్ మంత్రి వ‌ర్గం తీవ్రంగా ఖండించి, దానిని త‌ప్పేన‌ని ఒప్పుకుంది. అదేసమయంలో బాధ్యులైన ఇద్ద‌రు ఎస్పైల‌ను సస్పెండ్ చేసింది. అయితే, కేసీఆర్ మాత్రం.. ఇది ఉద్దేశ పూర్వ‌కంగా జ‌రిగిందికాద‌ని చెప్పుకొచ్చారు. అంతేకాదు, రైతాంగాన్ని ఊర‌డించేందుకు […]

టీడీపీకి షాక్‌:  బీజేపీకి వైసీపీ మ‌ద్ద‌తు

ఏపీలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. మిత్రుల మ‌ధ్య క‌ల‌హాలు.. కొత్త పొత్తులు, వ్యూహాల‌తో రాజ‌కీయ పార్టీలు బిజీబిజీగా ఉంటున్నాయి. ముఖ్యంగా వైసీపీ ఈ విష‌యంలో వ్యూహాత్మ‌కంగా అడుగులేస్తోంద‌ని మీడియా వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. బీజేపీకి మ‌ద్ద‌తు ఇచ్చేందుకు చూచాయ‌గా ఒప్పుకున్న‌ట్లు ఆస‌క్తిక‌ర క‌థ‌నం చ‌క్కెర్లు కొడుతోంది. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఎన్‌డీఏ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌క‌టించ‌డం.. ఇప్పుడు టీడీపీకి మింగుడుప‌డ‌ని అంశంగా మారింది. ప్ర‌తిప‌క్ష వైసీపీతో బీజేపీ స‌త్సంబంధాలు కొన‌సాగిస్తోంద‌నే […]

కేజ్రీవాల్‌తో బీజేపీ మైండ్ గేమ్ స్టార్ట్‌

పార్టీలో కుమ్ములాటలు.. సొంత నాయ‌కుల మధ్యే అభిప్రాయ‌భేదాలు.. నేత‌ల‌పై కేసులు.. వెర‌సి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఓట‌మి.. `సామాన్యుడి`ని తీవ్రంగా వేధిస్తున్నాయి. అంతేగాక ఆయ‌న సీఎం పీఠానికి ఎస‌రు పెట్టేలా చేస్తున్నాయి. బీజేపీ హ‌వా దేశంలో న‌డుస్తున్న రోజుల్లో.. దానిని త‌ట్టుకుని సీఎం పీఠాన్ని ఎక్క‌డ‌మంటే మామూలు విష‌యం కాదు! అందులోనూ ఒక సామాన్యుడు గెల‌వ‌డమంటే దేశం మొత్తం నివ్వెర‌పోయింది. కానీ అప్పుడు పొగిడిన వాళ్లే ఇప్పుడు తిడుతున్నారు. ఆమ్ ఆద్మీ అంటూ స్థాపించిన పార్టీకి ఆ […]