డబ్బులివ్వలేం రాష్ట్రానికి తేల్చి చెప్పిన కేంద్రం

రెవెన్యూ లోటును భర్తీ చేయలేమంటే కుదరదని, విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిందేనని కేంద్రానికి స్పష్టం చేసింది. ఒక్క రైతు రుణమాఫీ తప్ప ఏ ఒక్క పథకాన్ని తాము కొత్తగా తీసుకురాలేదని పేర్కొంది. రాష్ట్ర విభజన తర్వాత 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.16,078.76 కోట్ల రెవెన్యూ లోటు తలెత్తింది. కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక సాయంగా విడుదల చేసిన రూ.2,303 కోట్లను పరిగణలోకి తీసుకున్న తర్వాత 2014 జూన్ 2 నుంచి 2015 మార్చి 31 నాటికి రూ.13,775.76 […]

సీఎం ని కదిలించిన చిన్నారి.

కారుణ్య మరణం ప్రసాదించాలని కోరుతూ జ్ఞానసాయికి సంబంధించి ప్రచురితమైన మానవీయ కథనం రాష్ట్రమంతటా చర్చనీయాంశమైంది.రమణప్ప, సరస్వతి దంపతుల కుమార్తె ఎనిమిది నెలల జ్ఞానసాయికి పుట్టుకతో కాలేయ సంబంధిత వ్యాధి ఉంది. ఇప్పటికే లక్షలు ఖర్చు చేసి చికిత్స చేయించినా ఫలితం దక్కలేదు. తమ చిన్నారి కూతురు జ్ఞానసాయి కి  కారుణ్య మరణం ప్రసాదించాలని కోర్టు ని ఆశ్రయించిన తల్లి దండ్రులు గోడు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కదిలించించింది . జ్ఞానసాయి చికిత్సకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే […]

చంద్రబాబు చైనా రెండోస్సారి..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్ 26న చైనాకి బయలుదేరుతున్నారు. ఆయనతోబాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ఏడుగురు ఉన్నతాధికారులు, ఇతరులు ముగ్గురు చైనా వెళుతున్నారు. నాలుగు రోజుల పాటు సాగే వారి పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం, రాజధాని నిర్మాణం కోసం చైనా సంస్థల సహాయ సహకారాలను పొందడం ప్రధాన ఉద్దేశ్యమని ప్రభుత్వం తెలియజేసింది. అదేంటి ఇదంతా ఇంతకు ముందే విన్నట్టుందా.అయితే మీరు విన్నదీ ,వింటున్నదీ నిజమే నండీ. గత ఏడాది కూడా చంద్రబాబు నాయుడు […]

బాబు మళ్ళీ రుణమాఫీ అన్నాడోచ్..

చంద్రబాబు కి ఎన్నికల హామీలు ఇచ్చి ఇచ్చి ఎక్కడికెళ్లినా హామీలివ్వటం అలవాటుగా మారిపోయింది.ఆచరణ సంగతి దేవుడెరుగు హామీలదేముంది చెప్పటమే కదా అన్న చందాగా తయారైంది బాబు వ్యవహారం.రుణమాఫీ విషయంలో మీరెవ్వరు చిల్లి గవ్వ కూడా చెల్లించొద్దు మా ప్రభుత్వం రాగానే మీ రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తాం అన్న చంద్రబాబే ఈ రోజు నా దగ్గర డబ్బుల్లేవు,అప్పు కూడా దొరకడం లేదని బీద ఏడుపులు ఏడవడం విడ్డురంగా ఉంది.అపార రాజకీయానుభవం వున్న చంద్రబాబు కి ఇన్నాళ్ళకి తత్వం […]

ముద్రగడ దీక్ష–పోస్టుమార్టం రిపోర్ట్

కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన దీక్షతో అనుకున్నది సాధించారు. తుని విధ్వంసం కేసులో అరెస్టైన పదమూడు మంది విడుదలయ్యేదాకా తాను దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు.వారికి బెయిల్ వచ్చి, విడుదలైన తర్వాతనే.. ఆయన బుధవారం నాడు దీక్షను విరమించారు. అనుకున్నది సాధించి, ప్రభుత్వం పైన పైచేయి సాధించినప్పటికీ… ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారనే వాదనలు వినిపిస్తున్నాయి.అరెస్టైన వారి విడుదల కోసం ముద్రగడ పదమూడు రోజుల పాటు దీక్ష చేశారు.దీనిపై […]

బడ్జెట్ లో లోటు దుబార లో గ్రేటు….

హైదరాబాద్‌ నుంచి అమరావతికి ప్రభుత్వ కార్యాలయాల హడావుడి తరలింపు వలన రూ.వందల కోట్లు దుబారా అవుతుండగా, ఈ దుబారా ఖర్చులోనూ చేతివాటం మెండుగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయ అద్దెలు, లీజుల వ్యవహారంలో రూ.కోట్లల్లో అక్రమ పద్దతుల్లో కొంత మంది జేబులు నింపుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి. కార్యాలయాల అద్దెలు, లీజులకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శ కాల్లోనే వాటంగా స్కాం చేయడానికి వెసులుబాటు కల్పించినట్లు తెలుస్తోంది. పైసా ఖర్చు లేకుండా కొన్ని లక్షల చదరపు అడుగుల సర్కారీ […]

ఒట్లు సరే..దీని సంగతేంటీ రెడ్డి గారూ ..

రాజకీయ నాయకుల దిగజారుడుతనం తారాస్థాయికి చేరింది.సవాళ్ళు ప్రతి సవాళ్ళు దాటిపోయి పెళ్ళాలు పిల్లలపైనే ఏకంగా ఓట్లు వేసేస్తున్నారు.అయ్యా అమరనాథరెడ్డి నువ్వు అంత నిప్పువే అయితే,నువ్వేదో గాంధిజీ కి అసలైన వారసుడినన్నట్టు బిల్డుప్ ఇస్తున్నావ్ కదా.ఈ ఒట్లు,సవాళ్ళు పక్కనబెట్టి ప్రజాస్వామ్య బద్దంగా ఒక పార్టీ గుర్తుపై గెలిచిన నువ్వు ఇంకో పార్టీలో చేరేముందు నీ పదవికి రాజీనామా చేసి దమ్ముంటే ప్రజాక్షేత్రం లో నిలబడు.అప్పుడు నువ్వెంతో నీ విలువెంతో తెలుస్తుంది. ఇక టీడీపీలోకి వలస వెళ్లిన చిత్తూరు జిల్లా […]

చంద్రబాబు నాన్చుడు-కెసిఆర్ దూకుడు..

తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ దూకుడుగా వెళుతున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడమే కాకుండా, పార్టీ ఫిరాయించిన నేతలకు పదవులు కూడా కట్టబెడుతున్నారు. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అలాగే మంత్రి అయ్యారు. అయితే చంద్రబాబు మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో ఆశావహుల్ని వెయిటింగ్‌లో పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చంద్రబాబుని కవ్వించడానికి కెసియార్‌ ఇంకోసారి పదవుల పందేరం స్టార్ట్‌ చెయ్యనున్నారని సమాచారమ్‌. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కెసియార్‌ భావిస్తున్నారట. అలాగే మాజీ ఎంపీ వివేక్‌కి ఉప ముఖ్యమంత్రి ఇవ్వనున్నారని గుసగుసలు […]

చంద్రబాబు కి మెట్రో చీఫ్‌ శ్రీధరన్ షాక్!!

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు ప్రాజెక్టుకు గట్టి ఎదురుదెబ్బతాకింది. ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంటానని ఢిల్లీ మెట్రో చీఫ్‌ శ్రీధరన్‌ ముఖ్యమంత్రికి స్పష్టం చేశారు. అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టుపై సీఎంతో చర్చ సాగింది. ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపుపై శ్రీధరన్‌ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. నిధులు కేటాయించకుండా 2019 నాటికి ప్రాజెక్టును ఎలా పూర్తిచేస్తామని ఆయన ప్రశ్నించారు. ‘ఇప్పటి వరకు సరిగా నిధులు, వసతులు కల్పించలేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉన్నట్లు […]