ఏపీలో ఎమ్మెల్సీ సీట్ల కోసం అధికార పార్టీలో పోరు తీవ్రంగా ఉంది. ఇప్పటికే స్థానిక సంస్థల కోటాలో చంద్రబాబు వివిధ జిల్లాలకు అభ్యర్థులను ప్రకటించేశారు. ఇక మిగిలిందల్లా ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ సీట్లు ఎవరికి వస్తాయా ? అని అందరూ ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నారు. అసెంబ్లీలో ఉన్న లెక్కల ప్రకారం టీడీపీకి ఐదు సీట్లు గ్యారెంటీ. ఆరో సీటు కాస్త మ్యానేజ్ చేస్తే దక్కించుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు మహిళలెవ్వరికి సీట్లు ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు […]
Tag: chandrababu naidu
కేఏ పాల్.. లోకేష్ కి ఇచ్చిన ఆఫర్ ఏంటో తెలుసా?
కేఏ పాల్.. దాదాపుగా ఇప్పుడు ఎవ్వరికీ గుర్తులేని పేరు! ప్రపంచం మొత్తం తిరిగానని, జార్జ్ బుష్ నుంచి ఒబామా వరకు అందరినీ తానే గెలిపించానని, తన సలహా తీసుకునే వాళ్లు నిర్ణయాలు తీసుకుంటారని ఇలా.. గొప్పలు చెప్పుకున్న పాల్.. తర్వాత కాలంలో ప్రజా శాంతి పార్టీ పేరుతో రాజకీయాల్లో కూడా వేలు పెట్టి కాలు మొత్తం కాల్చుకున్నాడు. ఆ తర్వాత కుటుంబ హత్యా కేసుల కారణంగా జైలుకు కూడా వెళ్లాడు. ఇప్పుడు గుర్తొచ్చాడా? అయితే, దాదాపు నాలుగు […]
పదవీ లేకుండా పార్టీకి సేవ చేస్తున్నవారికి ఇప్పుడు బలే ఛాన్స్
ఎమ్మెల్సీ ఆశావహుల జాబితా కొండవీటి చాంతాడులా పెరిగిపోతోంది. ఎవరికి ఈ అవకాశం దక్కుతుంతోనని ఆశావహులు వేయికళ్లతో ఎదుచూస్తున్నారు. ఇదే సందర్భంలో పార్టీలోకి వచ్చిన వారితో పాటు, సీనియర్లకు, అసంతృప్తులకు ఈసారి ఎమ్మెల్సీ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే ఈ జాబితాలో తానూ ఉన్నానని చెబుతున్నారు మహిళా నేత కవిత. ఈ విషయంపై ఆమె తన అసంతృప్తిని ఒక సమావేశంలో చంద్రబాబుపై వెళ్లగక్కారు. అయితే తనపై విమర్శలు చేసినా.. ఆమెకు ఈసారి ఎలాగైనా ఎమ్మెల్సీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. […]
ఉరకలు వేసే ఉత్సాహంతో రెడీ అవుతున్న ఏపీ టీడీపీ
ప్రపంచంలో వ్యాపారం – సినిమాలు – రాజకీయాలు ఇలా ఏ కీలక రంగాలు చూసుకున్నా వారసత్వం అనేది కామన్. వారి తండ్రి, తాతల నుంచి వచ్చిన ఇమేజ్ను అందిపుచ్చుకుని వారసులు దూసుకుపోయేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది ఎప్పటి నుంచో వస్తోందే. కొత్తేం కాదు. ఈ క్రమంలోనే ఏపీలో అధికార టీడీపీలో సైతం ఇప్పుడు మూడో తరం రాజకీయ వారసులు అధికారం, పదవి కోసం రేసులో దూసుకుపోతున్నారు. ఈ మూడో తరం లీడర్లలో ముందుగా ఏపీ సీఎం నారా […]
నాకు వ్యక్తులుకన్నా పార్టీ ముఖ్యం .. మంత్రిపై బాబు ఫైర్
విశాఖలో ఉప్పు నిప్పులా ఉన్న మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడికి పార్టీ అధినేత చంద్రబాబు గట్టి క్లాస్ పీకారు. ముఖ్యంగా గంటా శ్రీనివాసరావుపై ఫైర్ అయ్యారు. `ఇక నిన్ను భరించలేను` అంటూ అసహనం వ్యక్తం చేశారు. పార్టీ నేతలతో సఖ్యతగా ఉండకపోతే.. ఇక చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తే సహించబోనని స్పష్టంచేశారు. కొంతకాలం నుంచీ విశాఖలో గంటా వర్సెస్ అయ్యన్న వార్ జరుగుతోంది. అధినేత చంద్రబాబు ఎన్ని సార్లు వీరిద్దరినీ పిలిచి మందలించినా.. […]
కడప ఎమ్మెల్సీలో గెలుపు ఎవరిది..? ఓటు రేటు తెలిస్తే షాకే..!
మండలి ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ అధికార, విపక్షాలు శిబిర రాజకీయాలకు తెరతీశాయి. ముఖ్యంగా ప్రతిపక్ష అధినేత జగన్ సొంత జిల్లా కడపపై టీడీపీ ప్రత్యేకంగా దృష్టిసారించింది. దీంతో ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని ప్రతిపక్షం ఆరాటపడుతుంటే.. ఎలాగైనా పట్టు సాధించాలని అధికార పక్షం వ్యూహాలు రచిస్తోంది. ఇరు పక్షాల వ్యూహప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. ఇప్పుడు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పంట పండింది. తమ శిబిరాల్లోకి వచ్చే వారిపై కాసులు కుమ్మరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా రూ.40 లక్షల వరకూ […]
ఆ మూడు నియోజకవర్గాల్లో సీన్ రివర్స్ … ఎందుకంటే ?
ఆంధ్రప్రదేశ్లోని మూడు నియోజకవర్గాల్లో సీన్ రివర్స్ అయింది. మొన్నటివరకూ అధికార పక్షం హవా నడిచిన చోట.. ఇప్పుడు ప్రతిపక్ష వైసీపీ పవనాలు జోరుగా వీస్తున్నాయి. వైసీపీని వీడి ఎమ్మెల్యేలు అధికార టీడీపీలో చేరిపోతుంటే.. వారి ప్రత్యర్థులుగా, టీడీపీలో బలమైన నేతలుగా ఉన్నవారు వైసీపీ కండువా కప్పేసుకుంటున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో బలమైన నేతల స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలా అని ఆలోచిస్తున్న అధినేత జగన్కు.. పార్టీలో చేరిన, చేరబోయే వారిని అస్త్రాలుగా మార్చబోతున్నారు. ప్రస్తుతం తాడిపత్రి, ఆళ్లగడ్డ, […]
బాబు చతురతలో చిక్కుకున్న బీజేపీ.
వ్యూహ రచనలో ఏపీ సీఎం చంద్రబాబును మించిన వారు లేరనేది అందరికీ తెలిసిన విషయమే! మిత్ర పక్షం బీజేపీని కూడా తన చతురతతో ఇబ్బంది పెట్టి.. తెలివిగా పనులు చేయించుకుంటున్నారు. ఏపీ బీజేపీ నేతలు నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. అవి బీజేపీ అధిష్ఠానానికి ఏమాత్రం చేరకుండా చేయడంలో సఫలమవుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల టికెట్ల కేటాయింపుల్లోనూ బాబు చతురత బయటపడిందట. బీజేపీకి టికెట్ ఇవ్వలేదనే మాట నుంచి తనను కాపాడుకోవడానికి, ఇచ్చినా గెలుపొందలేకపోయారనే అపవాదు బీజేపీపై నెట్టేయడానికి సూపర్ […]
కర్నూలులో టీడీపీకి మరో బిగ్ షాక్.. వైసీపీ బలం రెట్టింపైనట్టే!!
కర్నూలులో టీడీపీకి భారీ షాక్ తగలబోతోంది. నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చేరికతో జిల్లాలో పార్టీ బలపడుతుందని ఊహించిన అధిష్ఠానానికి.. ఇప్పుడు అదే తలనొప్పిగా మారింది. బలపడాల్సిన చోట.. మరింత బలహీనంగా మారుతోంది. ఇప్పటికే పార్టీ సినియర్ నేత గంగుల ప్రభాకర్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకుని.. జగన్ చెంతకు చేరిపోయారు. ఇప్పుడు భూమా చేరికను తొలి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న శిల్పా వర్గం కూడా.. వైసీపీలో చేరిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం! జిల్లాలో ఇద్దరు […]