టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం జగన్ పాపాలు పండే రోజులు దగ్గరపడ్డాయని, ఆయన అతి త్వరలోనే జైలుకు వెళ్తారని నారా లోకేశ్ జోస్యం చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. జగన్ గిరిజనుల గుండెల్లో గునపాలు దింపారని, అత్యంత దారుణమైన పనులు చేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ మాఫియాలా మారి ఆరాచకాలు చేస్తోందని, సామాన్య ప్రజలను దోచుకుంటున్నదని పేర్కొన్నారు. సహజ వనరులను […]
Tag: AP CM
కాంట్రాక్ట్ లెక్చరర్ లకు గుడ్ న్యూస్…!
కరోనా మహమ్మారి కారణంగా ప్రైవేట్ టీచర్లు, కాంట్రాక్టు లెక్చరర్లు చాలా ఇబ్బందులు పడ్డారు. స్కూళ్లు, కాలేజీలు లేక.. జీతాలు రాక.. వేరే పనులు చేసుకోలేక తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ విషయాన్ని గమనించిన ఆంధ్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టు లెక్చరర్ లకు తీపి కబురు చెప్పింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్న కాంట్రాక్టర్లకు మేలు చేసేలా ఓ నిర్ణయాన్ని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని కాంట్రాక్ట్ లెక్చరర్ల […]
బ్రేకింగ్ : ఆగష్టు 16 నుండి పాఠశాలలు పున:ప్రారంభం..!
తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాఠశాలలు పున:ప్రారంభ విషయంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగష్టు 16 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలను పున: ప్రారంభించాలని జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా ఆగష్టు 16 ననే మొదటి విడత ‘నాడు-నేడు’ పనులను ప్రజలకు అంకితమిచ్చి.. రెండో విడత పనులను కూడా మొదలు పెట్టాలని అధికారులకు తెలియ చేశారు. ఈ క్రమంలో నూతన విద్యా విధానంపై సమగ్రంగా వివరించడమే కాకుండా.. […]
సచివాలయ ఉద్యోగులకు జగన్ షాకింగ్ న్యూస్..?
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు సీఎం అయ్యాక ఎన్నో నూతన పథకాలు ప్రవేశ పెట్టాడు. నవరత్నాలు లాంటి పథకాలు అమలు చేస్తూ పరిపాలన వ్యవస్థలో సరికొత్త మార్పు తీసుకువస్తున్నాడు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల పని తీరుపై ఫోకస్ పెట్టిన జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయంతో ముందుకు వచ్చింది. సచివాలయ వ్యవస్థ ప్రారంభమై రెండేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఓ కొత్త మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇకపై ప్రతి సచివాలయ ఊద్యోగికి బయోమెట్రిక్ […]
జల వివాదం: తెలంగాణ నేతలపై మండిపడ్డ జగన్..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా తెలంగాణ జల వివాదం పై పెదవి విప్పారు. గురువారం రోజు అనంతపురం జిల్లాలో రైతు దినోత్సవంలో పాల్గొన్న జగన్ తెలంగాణ రాజకీయ నేతలు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వెళ్లగక్కారు. గతంలోనే నీటి కేటాయింపుల విషయంలో ఒప్పందాలు జరిగాయని.. ఆ ఒప్పందాల ప్రకారమే తాము నీళ్లను వినియోగించుకుంటున్నామని.. ఇందులో తాము చేస్తున్న తప్పేంటి? అని తెలంగాణ నేతలను జగన్ సూటిగా ప్రశ్నించారు. నీటి కేటాయింపులపై సంతకాలు కూడా చేశారని […]
విద్యార్థులకు జగన్ సర్కార్ శుభవార్త..?
ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెడుతున్నట్లు ఏపీ సర్కార్ ప్రకటించింది. పాఠశాల విద్యాశాఖ ఈ మేరకు బుధవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ‘2024-25 ఏడాదిలో పదో తరగతి విద్యార్థులు సీబీఎస్ఈ సిలబస్లో ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పాఠశాలల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమంలో ఈ బోర్డు ద్వారా పరీక్షలు నిర్వహించే సామర్థ్యాన్ని పెంపొందిస్తామని, మూడు, అయిదు, ఎనిమిది తరగతుల విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని […]
పరకాల ఉన్నది బాబు పరువు తీసేందుకేనా..!
ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారుగా కేంద్ర మంత్రి సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ను సీఎం చంద్రబాబు ఏరికోరి నియమించుకున్నారు. అయితే, ఆయన కొన్నాళ్లలోనే వివాదాస్పదమవడంతో సమాచార కమిషనర్ని నియమించిన చంద్రబాబు పరకాల పవర్స్ని కట్ చేశారు. సీఎం పరువు పోయేలా కామెంట్లు చేశారని పరకాలపై పలువురు నేతలు ఇంటర్నల్గా వ్యాఖ్యానించారు. ఇక, ఆ తర్వాత పరకాల మీడియాలో కనిపించడం దాదాపు తగ్గిపోయింది. దీనికి ముందు కేబినెట్ మీటింగుల్లో కూడా(అర్హత లేకపోయినా) కనిపించిన పరకాల ఆ తర్వాత అయిపు […]
చంద్రబాబు వ్యూహాల్లో పదును తగ్గిందా…?
ఓ చేత్తో పాలనా పగ్గాలను, మరో చేత్తో పార్టీ వ్యవహారాలను సమర్థంగా సమన్వయం చేసుకురావడం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొత్తేమీ కాదు. ఉమ్మడి ఏపీకి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా వ్యవహరించిన రికార్డును తనపేరిట శాశ్వతంగా లిఖించుకున్న టీడీపీ అధినేత మంచి పాలనాదక్షుడిగా దేశవ్యాప్తంగా పేరు, ప్రతిష్టలు సంపాదించుకున్నారు. ఆయన తిరుగులేని రాజకీయ వ్యూహాలు, సామర్థ్యం కారణంగానే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగువారి ఆరాధ్య నటుడు, సంచలన రాజకీయ విజయాల సారథుడు, సాధకుడు అయిన ఎన్టీఆర్ చేతుల్లోంచి సైతం […]
చంద్రబాబు అక్కౌంట్లో మరో బురిడీ స్కెచ్..!
తెలుగువారు.. అందులోనూ ప్రత్యేకించి సీమాంధ్రులు చేసుకున్న పాపమేమోకాని… ఇప్పటిదాకా రాజధాని స్థాయి నగరం ఒకదానిని కూడా అభివృద్ధి చేసుకోలేకపోయారు. రెండువందలేళ్లు కష్టపడి మద్రాసును అభివృద్ధి చేస్తే అది తమిళతంబీలు తమదన్నారు. మళ్ళీ అరవై ఏళ్లు కష్టపడి హైదరాబాద్ను సైబరాబాద్గా మారిస్తే… దానిపై మీకు హక్కులేదంటూ తెలంగాణ తమ్ముళ్లు తరిమేశారు. దీంతో సీమాంధ్రలోనూ మద్రాసు, హైదరాబాద్, బెంగళూరులను తలదన్నే నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నది ప్రస్తుతం సీమాంధ్రులకు బలమైన సెంటిమెంట్గా మారిపోయింది. వాస్తవానికి.. ప్రజల్లో ఉన్న ఈ సెంటిమెంటే.. ఏపీలోని […]