ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న రెండు వేలకు చేరువలో నిలిచాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 […]
Tag: andhra pradesh
మండుతున్న ఎండలు..రాబోయే మూడు రోజులు మరింత తీవ్రం!
వేసవి కాలం మొదలైంది. రోజురోజుకు ఎండలు దంచి కొడుతున్నాయి. మార్చి నెల నుంచే ఎండలు ప్రారంభం కాగా.. ఏప్రిల్ నెల వచ్చే సరికి నిప్పులసెగ ముందు నిల్చున్న వాతావరణాన్ని తలపించింది. ఇక ఈ ఎండల దెబ్బకు ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. అయితే తాజా సమాచారం రాబోయే మూడు రోజులు అంటే ఏప్రిల్ 5 నుంచి 7 వరకు ఎండలు మరింత తీవ్రంగా ఉండనున్నాయి. 40 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని […]
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న సీఎం జగన్!
కంటికి కనిపించకుండా ప్రజలను నానా తంటాలు పెడుతున్న కరోనా వైరస్.. మళ్లీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కేసులు వెయ్యికి పైగా నమోదు అవుతున్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ క్యార్యక్రమం కూడా జోరుగానే జరుగుతోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు గుంటూరులో భారతపేట 140వ వార్డు సచివాలయంలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. సతీమణి భారతితో కలిసిన వెళ్లిన ఆయనకు అక్కడి వైద్యులు వ్యాక్సిన్ వేశారు. అనంతరం సీఎం సతీమణి వైఎస్ […]
ఏపీలో బెంబేలెత్తిస్తున్న కరోనా..నిన్నొక్క రోజే వెయ్యికిపైగా కేసులు!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న వెయ్యికి పైగా నమోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 […]
టీడీపీలోకి ఎన్టీఆర్..బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. 2009 ఎన్నికలలో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్టీఆర్..తన ప్రసంగాలతో అదరగొట్టారు. ఇక ఆ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని తెలుగు తమ్ముళ్లతో పాటు సినీ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. కానీ, ఎన్టీఆర్ మాత్రం రాజకీయాల వైపు మొగ్గు చూపడం లేదు. […]
మోసం గురూ.. మోడీ ఎంత పనిచేశాడు!
పాలిటిక్స్లో ఆరితేరిన వారు ఎలా ఉంటారో చూపించాలంటే.. ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో చూపిస్తే సరిపోతుంది! అని మొన్నామధ్య బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పుకొచ్చారు. ఆయన అలా అన్నప్పుడు సహజంగానే ప్రభుత్వాన్ని పడగొట్టి.. తమ పార్టీని గద్దె నెక్కించిన నేపథ్యంలో లాలూ అలా కామెంట్ చేసి ఉంటాడని అందరూ అనుకున్నారు. సాధారణంగా తెలుగు వాళ్లకు జాలి ఎక్కువ. చాలా విషయాల్లో క్షమించేసుకుంటూ పోతుంటారు. అలాంటి తెలుగు వారికి సైతం ఇప్పుడు మోడీ పేరెత్తితే […]
తెలంగాణలో అలా.. ఏపీలో ఇలా.. నాగ్ తీరేవేరు!
సినీ మన్మథుడు అక్కినేని నాగార్జున తీరు చాలా విచిత్రంగా ఉంది. పొలిటికల్గా ఆయన ఓ రేంజ్లో గేమ్ ఆడేస్తున్నారు. ఫక్తు రాజకీయ నేతలను సైతం ఆయన మించిపోతున్నాడని అంటున్నారు విశ్లేషకులు. అసలేం జరిగిందో చూద్దాం. నాగార్జునకు వారసత్వంగా వచ్చిన వ్యాపారాలు సహా ఆయన ప్రారంభించిన వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగానే అవి ప్రారంభం కావడంతో కొన్ని హైదరాబాద్, కొన్నింటిని విజయవాడ, విశాఖల్లోను ఏర్పాటు చేశారు. అయితే, తర్వాత రాష్ట్రం విడిపోయింది. దీంతో ఆ ఆస్తులు […]
ఆంధ్రప్రదేశ్ గురించి… ఏం చెప్పితిరి లోకేష్
రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ టీడీపీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాష్ట్రంలో మంత్రి పదవిలో ఉన్న సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ అధికారం చేపట్టి ఐదు నెలలు గడుస్తున్నా.. పార్టీలో అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తవుతున్నా ఆయన మాటలు తడబడుతూనే ఉన్నాయి. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కాని పరిస్థితి నెలకొంది. గతంలోనే అనేక సార్లు ఆయన మాటలు తడబడ్డాయి. దీంతో వైసీపీ నేతలు రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి వంటి వారు లోకేష్తో గేమ్ […]
ఏపీని కేంద్రం ముంచేస్తోందా?
రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే.. సమాఖ్య వ్యవస్థ బాగుండాలి! అంటే కేంద్రం రాష్ట్ర సంబంధాలు బాగుండాలి. కేంద్రంలో ఒక ప్రభుత్వం, రాష్ట్రంలో మరో పార్టీ ప్రభుత్వం ఉంటే ఈ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఫలితంగా రాష్ట్ర అభివృద్ధి నానాటికీ తీసికట్టుగానే మారుతుంది. అదే, కేంద్రం, రాష్ట్రాల్లో ఏక పార్టీ ప్రభుత్వం ఉంటే.. చాలా బెటర్. అవసరానికి కేంద్రం నిధులివ్వడమే కాకుండా.. అన్ని విషయాల్లోనూ వెనుకేసుకు వస్తుంది. ఇటీవల జరిగిన యూపీ చిన్నారుల మృతులు, హరియాణాలో డేరా బాబా […]