రాష్ట్రంలో అన్ని పార్టీల నుంచి ఒకే మాట వినిపిస్తోంది. అదే.. పొత్తులు.. బాబూ.. పొత్తులు.. అనే మాట. ఎ వరు ఎవరితో జత కడతారు.. అనే మాట పక్కన పెడితే.. అసలు ఎన్నికలకు రెండేళ్ల ముందే.. ఈ పొత్తుల విషయం చర్చకు రావడం.. ప్రజల్లో ఎలాంటి సంకేతాలను పంపిస్తుందనేది చర్చకు దారితీస్తోంది. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? పార్టీలు ఎందుకు పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నట్టు ప్రజలు చర్చించుకుంటున్నారు? అనే విషయాలు చర్చకు వస్తున్నాయి. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ-బీజేపీ-జనసేన(పొటీ […]
Category: Politics
బీజేపీలోకి జేసీ దివాకర్ రెడ్డి… బాబు పక్కన పెట్టేశారా…!
అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పరిస్థితి ఎటూ తేల డం లేదట. ఆయన ఇప్పటికే.. కీలక జాతీయ పార్టీగా ఉన్న బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. నిజానికి సీమలో బీజేపీ ఎదగాలని.. కలలు కంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కలిసి వచ్చే నాయకులతో .. పార్టీ ముందుకు సాగాలని వ్యూహాలు కూడా రెడీ చేసుకుంటున్న విషయం చర్చకు వస్తోంది. ఈ నేపథ్యంలోనే అనంతలో తమ హవా ప్రదర్శిస్తున్న […]
షాకింగ్: రాజకీయాలకు ముగ్గురు వైసీపీ రెడ్డి ఎమ్మెల్యేలు గుడ్ బై…!
ఏపీలో అధికార వైసీపీలో రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఓ రేంజ్లో రగులుతున్నారు. వీరి బాధలు అయితే మామూలుగా లేవు. పేరుకు మాత్రమే తమ సామాజిక వర్గానికి చెందిన జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నా తమను జగన్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని… పైగా సజ్జల లాంటి వాళ్లే పైన చక్రాలు తిప్పేస్తూ ఉండడంతో రాజకీయంగా దశాబ్దాల నుంచి తమకు ఎంత అనుభవం ఉన్నా ఉపయోగం లేదని వారు వాపోతున్నారు. పార్టీలో రెడ్డి ఎమ్మెల్యేలు ఏకంగా 50 మంది […]
బ్రేకింగ్: టీడీపీ కీలక నేత మృతి..
టీడీపీ కీలక నేత, ఆ పార్టీ మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంలో బాధపడుతున్నారు. తాజాగా ఆయన హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తి నియోజకవర్గం నుంచి ఐదసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన చంద్రబాబు కేబినెట్లో అటవీ శాఖా మంత్రిగా కూడా పనిచేశారు. చంద్రబాబుపై అలిపిరి ఘటనలో బాంబు దాడి జరిగినప్పుడు బొజ్జల కూడా గాయపడ్డారు. కొద్ది రోజుల క్రితం బొజ్జల పుట్టిన రోజు […]
మంత్రి రజనీని వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్..!
రాజకీయాలు అంటేనే సెంటిమెంటు కలబోత. ఇటు ప్రజల్లో ఉన్నా.. అటు వ్యక్తిగతంగా అయినా.. నాయకు లకు సెంటిమెంటు అవసరం. ఇక, పార్టీలు కూడా సెంటిమెంటుచుట్టూనే రాజకీయాలు చేస్తున్నాయి. సెంటిమెంటు లేని రాజకీయాలు.. సిరాలేని పెన్నుతో సమానం అంటాడు.. కాళోజీ నారాయణరావు. సో.. సెంటిమెంటుకు.. రాజకీయాలకు మధ్య సయామీ కవలలకున్నంత బంధం ఉంటుంది. అయితే.. ఈ సెంటిమెంటు.. పాజిటివ్గానూ పనిచేస్తుంది.. నెగిటివ్గానూ.. పనిచేస్తుంది. పాజిటివ్గా ఉంటే.. ఒకరకంగా.. పార్టీలు పుంజుకుంటాయి. ప్రజల్లోకి వెళ్లి మరీ.. సదరు పాజిటివ్ సెంటిమెం […]
ఏపీలో మళ్లీ వైసీపీని గెలిపించేది ఆ ఒక్కటేనా..!
ఏపీ అధికార పార్టీ వైసీపీని ఎవరు నడిపిస్తారు? వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ను పక్కన పెట్టిన తర్వాత.. పార్టీ పరిస్థితి ఏంటి? ఎలా పుంజుకుంటుంది? ఈ ప్రశ్నలకు సీనియర్లు.. చెబుతున్న మాట.. ముఖ్యమంత్రి జగనే అని! ఎందుకంటే.. ఆయన ఇమేజ్ ఇప్పుడు రాష్ట్రంలో రెపరెపలాడుతోంది. ఎక్కడ విన్నా.. జగన్ నామస్మరణే కనిపిస్తోంది.. వినిపిస్తోందని అంటున్నారు. ఈ సమయంలో ఆయన పట్టు జారకుండా.. కేవలం పార్టీ నేతలపైనే ఆధారపడకుండా.. వ్యవహరించాలని సూచిస్తున్నారు. తాజగా వైసీపీ పక్ష నాయకులతో జగన్ భేటీ […]
సినిమాల్లో హిట్టవుతోన్న పవన్ జనాల్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు…!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహారం.. ఆసక్తిగా మారిందని అంటున్నారు పరిశీలకులు. ఆయన కావాలి.. రావాలి.. అని యువత కోరుకుంటున్నారు. అయితే.. ఆయన వస్తున్నారు. కానీ, ఇలాల వచ్చి అలా వెళ్లిపోయి.. షెడ్యూల్ చూసుకుని వస్తున్నారు. దీంతో పార్టీ పుంజుకునేది ఎప్పుడు? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. నిజానికి జనసేనకు ఫాలోయింగ్ లేదా? అంటే.. ఉంది. వైసీపీకి, టీడీపీకి మించిన ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే.. ప్రస్తుత రాజకీయాల్లో నిజాయితీ గురించి.. డబ్బులు ఇవ్వకుండా.. ఓట్లేయాలనే అంశం గురించి […]
పీకేను పిండేయబోతున్న జగన్ ..ఎలాగంటారా ఇలా ?
ఔను! ఇప్పుడు ఈ సందేహాలు కూడా వస్తున్నాయి. రాజకీయాల్లో ఇది అర్హమైనది.. ఇది కాదు.. అని చెప్ప డానికి ఛాన్స్ లేదు. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి అవసరం వచ్చినా.. నాయకులు ఆయా అవసరాలను తమ కు అనుకూలంగా మార్చుకునేందుకు ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు.. ఏపీ సీఎం జగన్ కూ డా భవిష్యత్తులో ఇలాంటి వ్యూహమే వేసే అవకాశం కనిపిస్తోంది. రేపు వచ్చే ఎన్నికల్లో.. పోటీ తీవ్రత పెరి గి.. తను గెలవడం కష్టమని అనుకున్నప్పుడు.. సెంటిమెంటును […]
విజయవాడ వైసీపీ టిక్కెట్ కోసం ఇంత పోటీ ఉందా….?
రాష్ట్రంలోని ఏ పార్టీకైనా.. విజయవాడ నగరం కీలకం. ఇక్కడ పట్టు పెంచుకుంటే..రాష్ట్రంలో ఎక్కడైనా వాయిస్ వినిపించవచ్చనే ధీమా ఉంటుంది. ఇలా చూసుకుంటే.. ప్రస్తుతం వైసీపీకి ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీకి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఉన్నారు. అయితే.. వచ్చే ఎన్నికల నాటి పరిస్థితి చూస్తే.. వైసీపీకి తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలపై ఉన్న భరోసా..సెంట్రల్ నియోజకవర్గంపై లేదు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మల్లాది విష్ణు ఉన్నారు. అయితే.. ఆయన పనితీరు […]