వచ్చే ఎన్నికలకు సంబంధించి గెలుపుగుర్రాలకు మాత్రమే టికెట్లు ఇస్తానని.. టీడీపీ అధినేత చంద్రబా బు పదే పదే చెబుతున్నారు. ప్రజల్లో ఉండేవారికి.. ప్రజలతో జై కొట్టించుకునే వారికి మాత్రమే టికెట్లు దక్కుతాయని అంటున్నారు. ముఖ్యంగా యువతకు టికెట్లు ఎక్కువగా ఇస్తామని చెబుతున్నారు. అయి తే.. ఆచరణలోకి వచ్చే సరికిమాత్రం ఇది సాధ్యమేనా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. ఎన్నికలకు ఇంకా చాలానే సమయం ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు చుట్టూ చేరిన కొందరు సీనియర్లు ఆయనను […]
Category: Politics
ఎమ్మెల్యేగా రాజుగారు..వైసీపీపై రివెంజ్..?
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఎన్నికల్లో వైసీపే తరుపున నర్సాపురం ఎంపీగా గెలిచిన ఆయన..ఆరు నెలల్లోనే వైసీపీ ప్రభుత్వ విధానాలపై తిరుగుబాటు చేశారు. వైసీపీ తప్పులని నిత్యం ఎత్తిచూపుతూనే ఉన్నారు. ఇక తమని టార్గెట్ చేసిన్ రఘురామకు చెక్ పెట్టడానికి వైసీపీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిందో చెప్పాల్సిన పని లేదు. అయినా సరే రఘురామ ఢిల్లీలో ఉంటూ..ప్రాతిరోజూ మీడియా సమావేశం పెట్టి..జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా వైసీపీ […]
కేసీఆర్ ‘బీఆర్ఎస్’: బాబు లైట్..టీడీపీకి రిస్క్..!
తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ జాతీయ పార్టీ ప్రభావం ఏపీలో ఉంటుందా? తెలంగాణలో టీడీపీని లేకుండా చేసిన కేసీఆర్..ఏపీలో కూడా టీడీపీని దెబ్బకొట్టగలరా? అంటే అబ్బే కష్టమే అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణలో రాజకీయ పరిస్తితులు వేరు..ఏపీలో వేరు. రాష్ట్రం విడిపోయాక చంద్రబాబు పూర్తిగా ఏపీపై ఫోకస్ పెట్టడం, తెలంగాణని సరిగ్గా పట్టించుకోవడం..అక్కడ పరిస్తితులని ఉపయోగించుకుని కేసీఆర్..టీడీపీని లేకుండా చేశారు. ఇప్పుడు టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్ గా మార్చి..జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి రెడీ […]
చిరు ప్రకటనతో వైసీపీలో ఫుల్ హుషారు…!
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల్లో కొత్త హుషారు చోటు చేసుకుందట. వచ్చే ఎన్నికలకు సంబంధించి నాయకులు ఆసక్తిగా చర్చించు కుంటున్నారట. ఇప్పుడు ఏపీలో ఇలాంటి చర్చే జరుగుతోంది. మరి దీనికి కారణం ఏంటి ? ఎందుకు? అనుకుంటున్నారా? తాజాగా మెగా స్టార్ చిరంజీవి చేసిన ప్రకటనే కారణమని తెలుస్తోంది. అదేంటి? వైసీపీకి పోటీ ఇచ్చేలా.. అధికారం దక్కించుకునేలా.. జనసేనకు అన్ని విధాలా అండగా ఉంటానని చిరు ప్రకటిస్తే.. అది వైసీపీకి మైనస్ కదా.. మరి ఆ పార్టీ […]
కేసిఆర్ ఓ ఆదిపురుష్… రాంగోపాల్ వర్మ సెన్సేషనల్ కామెంట్స్..!
సంచలనాలకు మారుపేరైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన ఏది మాట్లాడితే అది ఒక సంచలనమే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా మార్చుతూ బీఆర్ఎస్ అనే పేరు పెట్టారు. ఈ ప్రకటన వచ్చిన వెంటనే ఆర్జీవి సోషల్ మీడియా వేదికగా ఎవరు ఊహించని విధంగా తనదైన రీతిలో కామెంట్లు పెట్టాడు. ఇప్పుడు ఆ కామెంట్లు వైరల్ గా మారాయి. ఆర్జీవి సోషల్ మీడియా వేదికగా కేసిఆర్ ని ఆదిపురుష్ అంటూ […]
నెల్లూరు టీడీపీలో కొత్త ముఖాలు..నాలుగు సీట్లలో..?
గత ఎన్నికల తర్వాత దాదాపు అన్నీ జిల్లాల్లో టీడీపీ గాడిన పడింది గాని..ఒక్క నెల్లూరు జిల్లాలో మాత్రం 2019 ఎన్నికల పరిస్తితులే ఉన్నాయి. ఆఖరికి సీఎం జగన్ సొంత జిల్లా కడపలో కూడా టీడీపీ పరిస్తితి కాస్త మెరుగైంది..రెండు-మూడు సీట్లలో ఆ పార్టీ పరిస్తితి బాగుంది. అటు కర్నూలు జిల్లాలో కూడా పర్లేదు. అలాగే చిత్తూరు జిల్లాలో కాస్త బెటర్. కానీ నెల్లూరులోనే టీడీపీ పుంజుకోలేదు. నాయకులు ఇప్పటికీ సరిగ్గా పనిచేయకపోవడం..పైగా కొందరు నాయకులు టీడీపీలో పనిచేస్తూనే..పరోక్షంగా […]
చిరుపై ‘ఫ్యాన్’ ఫైర్..తమ్ముళ్ళ ఫైట్..!
సినిమాల్లో మెగాస్టార్గా ఉన్న చిరంజీవి..రాజకీయాల్లో పెద్దగా సక్సెస్ కాలేదు..అయితే ఇక తన రాజకీయాలు పెద్దగా పడవని చెప్పి మళ్ళీ సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. కానీ చిరంజీవి రాజకీయాలు వదిలేసినా..ఆయన్ని మాత్రం రాజకీయాలు వదలడం లేదు. ఎప్పుడు ఏదొరకంగా ఆయన చుట్టూ రాజకీయం నడుస్తూనే ఉంది. కాకపోతే చిరంజీవి సోదరుడుగా ఉన్న పవన్ జనసేన పెట్టి రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. దీంతో చిరు మద్ధతు పవన్కు ఉంటుందని మెగా ఫ్యాన్స్ ఆశించారు. కానీ అది జరగలేదు. పైగా […]
వాలంటీర్లే వైసీపీకి రివర్స్..ఇదెక్కడి ట్విస్ట్..?
జగన్ అధికారంలోకి రాగానే తీసుకొచ్చిన కొత్త వ్యవస్థ ఏదైనా ఉందంటే అది గ్రామ సచివాలయ వ్యవస్థ..దానికి అనుబంధంగా వాలంటీర్ వ్యవస్థ. దీని ద్వారా నేరుగా ప్రజలకు లబ్ది చేకూరుతుంది. అలాగే ఏ పని కావాలన్న సచివాలయం ద్వారా అయిపోతుంది. ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్ని పెట్టిన విషయం తెలిసిందే. ఆ 50 ఇళ్ల బాధ్యతని వాలంటీరే చూసుకుంటారు. ఇక ఈ వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు అనే సంగతి తెలిసిందే..ఆ విషయం వైసీపీ నేతలే చాలా సందర్భాల్లో […]
బాబుకు రెండు సీట్లు ఫిక్స్ చేసిన వైసీపీ.!
వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు కంచుకోట అయిన కుప్పం నియోజకవర్గంని ఏ స్థాయిలో టార్గెట్ చేశారో చెప్పాల్సిన పని లేదు. ఎలాగైనా కుప్పంని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వైసీపీ ముందుకెళుతుంది. ఇక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో తెలియదు గాని..ఆయన కేవలం కుప్పంపై ఫోకస్ పెట్టి..అక్కడ టీడీపీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కుప్పంలో వైసీపీ బలం పెంచడంలో సక్సెస్ అయ్యారు. పంచాయితీ, పరిషత్, కుప్పం మున్సిపాలిటీలో […]









