ప్రస్తుతం కరోనా వైరస్ వీర లెవల్లో వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ పంపిణీ జోరుగా కొనసాగుతున్నా.. కరోనా ఉదృతి ఏ మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలోనే సామాన్యులతో పాటు ఎంతో జాగ్రత్తగా ఉండే సెలబ్రెటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ఎందరో సినీ తారలకు కరోనా సోకగా.. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ సెల్ఫ్ క్వారెంటైన్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న చిత్రాల్లో `రాధేశ్యామ్` ఒకటి. ఈ సినిమా షూటింగ్ చివరి […]
Category: Latest News
రేటు భారీగా పెంచేసిన `ఉప్పెన` డైరెక్టర్..ఇప్పుడిదే హాట్టాపిక్?
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్గా తెరకెక్కిన తాజా చిత్రం `ఉప్పెన`. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రం ద్వారా డైరెక్టర్గా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. మొదటి చిత్రంతోనే సూపర్ డూపర్ హిట్ అందుకుని అందరి చూపులను తనవైపు తిప్పుకున్నాడు బుచ్చిబాబు. భారీ లాభాలు రావడంతో ఉప్పెన నిర్మాతలు బుచ్చిబాబుకు ఒక బెంజ్ కారును గిఫ్ట్గా ఇచ్చారు. అంతేకాదు తమ బ్యానర్లో మరో సినిమా చేసే అవకాశం ఇచ్చారు మైత్రి మూవీ […]
కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం!
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కిషన్రెడ్డి పెద్దన్నయ్య యాదగిరి రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్లోని తన నివాసంలో బుధవారం రాత్రి తుది శ్వాస్ విడిచారు. ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రి కిషన్రెడ్డి తిమ్మాపూర్ చేరుకున్నారు. మరోవైపు పలువురు బీజేపీ నాయకులు యాదగిరి రెడ్డి మృతిపై సంతాపం వ్యాక్తం చేస్తున్నారు. […]
ఇస్మార్ట్ పోరికి బంపర్ ఆఫర్ ఇచ్చిన యంగ్ టైగర్?!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. అక్టోబర్లో విడుదల కానుంది. ఇక ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. నందమూరి కళ్యాణ్రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్తో పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ రూపొందించబోతున్నారు. ఏప్రిల్ 29వ తేదీ […]
నేటి నుంచి రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్..ఎప్పటి వరకంటే?
ప్రాణాంతక వైరస్ అయిన కరోనా రోజురోజుకు వేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. తగ్గినట్టే తగ్గిన కరోనా సెకెండ్ వేవ్లో విశ్వరూపం చూపిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతున్నా.. ఈ మహమ్మారి వారు, వీరు అనే తేడా లేకుండా అందరిపై పంజా విసురుతూనే ఉంది. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ లాక్డౌన్ విధిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలో కూడా సంపూర్ణ లాక్డౌన్ విధించారు. కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతోన్న నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ […]
600 మంది సిబ్బందికి కరోనా.. ఎస్బీఐ కీలక నిర్ణయం
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నది. మొదటి విడత కంటే రెండో విడతలో సుడిగాలిలా జనాన్ని చుట్టేస్తున్నది. పదుల సంఖ్యలో ఉద్యోగులు వైరస్ బారిన పడుతున్నారు. కరోనా రెండో వేవ్లో తెలంగాణ వ్యాప్తంగా కేవలం ఒక్క ఎస్బీఐకి చెందిన 600 మంది ఉద్యోగులు కొవిడ్ బారిన పడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ఈ నేపథ్యంలోనే కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ సీజీఎం ఓపీ మిశ్రా ప్రకటన విడుదల చేశారు. ఖాతాదారులతో నేరుగా సంబంధాలు ఉన్న ఉద్యోగులే కొవిడ్ […]
తమిళనాడులో రూ.1500కోట్ల విలువైన డ్రగ్స్..!
దేశంలో మత్తుపదార్థాల అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నది. వేల కోట్ల రూపాయాల డ్రగ్స్ దేశంలోకి చొరబడుతున్నాయి. డ్రగ్స్ అక్రమ రవాణాకు సముద్రతీర ప్రాంతాలు, పోర్టులు కేంద్రాలుగా నిలుస్తుండడం విశేషం. తమిళనాడు తదితర ప్రాంతాల్లోని షిప్పింగ్ పోర్టులో డ్రగ్స్ రవాణా పెరిగింది. ఇటీవల తరచుగా డ్రగ్స్ రవాణా చేయడం, అధికారుల తనిఖీల్లో వెలుగుచూడడం పరిపాటిగా మారిపోయింది. విదేశాల నుంచి నేరుగా డ్రగ్స్ రవాణా జరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. తాజాగా తమిళనాడులో పట్టుబడిన డ్రగ్స్ను చూసి అధికారులే బిత్తరపోయారు. వాటి […]
వాటితో మాకు సంబంధం లేదు.. ఖాతాదారులకు ఎస్బీఐ హెచ్చరిక
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుంచి మాట్లాడుతున్నామని మిమ్మల్ని ఎవరైనా సంప్రదించారా..? లేక ఫోన్లు చేస్తున్నారా..? ఎస్బీఐలో పర్సనల్ లోన్, ఆటో లోన్, బిజినెస్ లోన్ ఇప్పిస్తామని చెప్పారా..? అయితే అలాంటి కాల్స్ వస్తే మీరు అప్రమత్తంగా ఉండాలని, వాటితో మాకు ఎలాంటి సంబంధం లేదని ఖాతాదారులకు ఎస్బీఐ హెచ్చరికలు జారీ చేసింది. అందుకు కారణం లేకపోలేదు. భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బీఐ పేరుతో నకిలీ సంస్థలు సృష్టించి రుణాల పేరుతో […]
భారత్ ఘనత.. ఐరాస కీలక కమిటీల్లో సభ్యత్వం..!
భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి మరింతగా పెరిగింది. అరుదైన అవకాశాన్ని, గుర్తింపును పొందింది. ఐక్యరాజ్య సమితి (యూఎన్) లోని మూడు ముఖ్యమైన కమిటీల్లో సభ్యత్వాన్ని సాధించింది. ఆర్థిక, సామాజిక కమిటీల్లో సభ్యునిగా చేరిన భారత్.. మూడేండ్లుగా మహిళా సాధికారత కోసం లింగ సమానత్వం, మహిళల సాధికారత కోసం యూఎన్ ఎంటిటీ ఫర్ ఈక్వాలిటీలో భారత్ సభ్యత్వం పొందింది. ఈ సభ్యత్వం పదవీకాలం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రారంభమవుతుంది. ప్రపంచ ఆహార కార్యక్రమంలో భారతదేశాన్ని ఇప్పటికే […]