ఎన్నికల సీజన్ మొదలు కావడంతో రాష్ట్రంలో సర్వేల జోరు మొదలైంది…ఇప్పటికే పలు సర్వే సంస్థలు రాష్ట్రంలో తిరుగుతూ ప్రజల నాడిని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలాగే ప్రధాన పార్టీలు సైతం తమ సొంత సర్వేలని చేయించుకుంటున్నాయి. ఇక ఆ మధ్య జాతీయ సర్వేలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. వరుసగా వచ్చిన జాతీయ సర్వేల్లో మళ్ళీ వైసీపీదే అధికారమని తేలింది. ఇక తాజాగా ఆత్మసాక్షి సంస్థ ఏపీకి సంబంధించి అధికారికంగా ఓ సర్వే రిలీజ్ చేసింది. ఆత్మసాక్షి మూడ్ […]
Author: Krishna
ధర్మాన బ్రదర్స్కు పవన్ ప్లస్?
గత ఎన్నికల్లో వైసీపీకి ఊహించని విధంగా 151 సీట్లు రావడానికి కారణాలు చాలా ఉన్నాయి. టీడీపీపై వ్యతిరేకత, జగన్ ఒక్క ఛాన్స్..జగన్పై సానుభూతి,…అదే సమయంలో పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఓట్లు చీల్చడం. జనసేన ఓట్లు చీల్చడం వల్ల దాదాపు 50 మంది వరకు ఎమ్మెల్యేలు గెలిచారని చెప్పొచ్చు. ఒకవేళ ఆ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేసి ఉంటే వైసీపీకి గట్టి పోటీ ఎదురయ్యేది ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు. అయితే గత ఎన్నికల్లో […]
కాల్వ-పల్లెకు కష్టాలు..మళ్ళీ డౌటే?
తెలుగుదేశం పార్టీలో కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథ్ రెడ్డి…ఈ ఇద్దరు నేతలు చాలా సీనియర్లు. దశాబ్దాల కాలం నుంచి అనంతపురం రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇద్దరు నేతలు టీడీపీకి ఎప్పుడు సపోర్ట్గా ఉంటూ వస్తారు. ఇద్దరు నేతలు కూడా చంద్రబాబుకు సన్నిహితులే. అయితే ఇలా టీడీపీలో సీనియర్లుగా ఉన్న ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయి పోరాడుతున్న ఈ ఇద్దరు నేతలకు మళ్ళీ గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని…తాజాగా వస్తున్న సర్వేల్లో […]
ఆ కంచుకోటల్లో వైసీపీకి రిస్క్?
గత ఎన్నికలతో పోలిస్తే..ఇప్పుడు ఏపీలో రాజకీయ సమీకరణాలు బాగా మారాయి…ఆ ఎన్నికల్లో ఏ జిల్లా చూసిన పూర్తిగా వైసీపీకి అనుకూలంగా ఉన్న పరిస్తితి…కానీ ఇప్పుడు సీన్ మారిపోతూ వస్తుంది..ఇప్పుడు చాలా జిల్లాల్లో వైసీపీకి రిస్క్ పెరుగుతుంది. ఆఖరికి వైసీపీ కంచుకోటలుగా ఉన్న జిల్లాల్లో కూడా పరిస్తితులు మారుతున్నాయి. ఇదే క్రమంలో వైసీపీ కంచుకోటగా ఉన్న నెల్లూరులో కూడా సీన్ మారిపోతూ వస్తుంది. గత ఎన్నికల్లో జిల్లాలో 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది. కానీ ఇప్పుడు ఆ […]
సర్వే: సిక్కొలులో కొత్త లెక్కలు ఇవే..!
ఏపీ రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఇప్పటివరకు అన్నీ జిల్లాల్లోనూ వైసీపీ ఆధిపత్యం నడిచింది…గత ఎన్నికల్లో అన్నీ జిల్లాల్లో వైసీపీ మెజారిటీ సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే…అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చి మూడేళ్లు దాటింది…ఈ క్రమంలో పలు జిల్లాలో వైసీపీ లీడ్ నిదానంగా తగ్గుతూ వస్తుందని పలు సర్వేల్లో స్పష్టం అవుతుంది…అలా అని రాష్ట్ర స్థాయిలో వైసీపీ ఆధిక్యం భారీగా తగ్గలేదు. కానీ కొన్ని జిల్లాల్లో వైసీపీ గ్రాఫ్ ఊహించని విధంగా పడిపోతుందని తెలుస్తోంది. ఇదే క్రమంలో […]
సత్తెనపల్లి జనసేనకు వదులుతారా?
రాష్ట్రంలో ఇప్పుడుప్పుడే టీడీపీ గ్రాఫ్ పెరుగుతుంది…ఇటీవల వస్తున్న పలు సర్వేల్లో టీడీపీ పుంజుకుందని తెలుస్తోంది…ఇంకొంచెం కష్టపడితే నెక్స్ట్ టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఇలాంటి తరుణంలో చాలా నియోజకవర్గాల్లో సీటు కోసం నేతల మధ్య పోటీ పెరుగుతుంది. ఎవరికి వారు సీటు విషయంలో పోటీ పడుతున్నారు. అలాగే సెపరేట్గా పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళుతున్నారు. ఇలా గ్రూపు రాజకీయాలు చేయడం వల్ల పార్టీకే ఇబ్బంది అయ్యేలా ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లా […]
డేంజర్ జోన్లో పరిటాల ఫ్యామిలీ..!
రాష్ట్ర రాజకీయాల్లో పరిటాల ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు…ఎన్నో ఏళ్ల నుంచి అనంతపురం రాజకీయాల్లో పరిటాల ఫ్యామిలీ ముఖ్య పాత్ర పోషిస్తుంది…టీడీపీకి అండగా ఉంటూ వస్తుంది. అయితే పరిటాల రవి ఉన్నంత కాలం తిరుగులేకుండా ఉంది…ఆయన తర్వాత కూడా సునీతమ్మ సత్తా చాటుతూ వచ్చారు. కానీ పరిటాల వారసుడుగా పరిటాల శ్రీరామ్ ఎంట్రీ ఇచ్చాక…పరిటాల ఫ్యామిలీ రాజకీయంగా సత్తా చాటలేకపోతుంది. 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. రాప్తాడు బరిలో […]
ఎన్టీఆర్ ఫ్యాన్స్ మళ్ళీ జగన్ వైపేనా..?
రెండు తెలుగు రాష్ట్రాల్లో నందమూరి ఫ్యామిలీని, టీడీపీని వేరు వేరుగా చూడలేం. దివంగత ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ…చంద్రబాబు చేతుల్లోకి వెళ్ళినా సరే…టీడీపీపై నందమూరి ముద్ర ఉంటుంది…అలాగే ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. కానీ గత కొనేళ్లుగా సినీ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ మాత్రం టీడీపీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే కావాలనే చంద్రబాబు…ఎన్టీఆర్ని తోక్కేస్తున్నారని ప్రచారం ఉంది. లోకేష్ కోసం ఎన్టీఆర్ని మళ్ళీ రాజకీయాల వైపుకు రానివ్వలేదనే టాక్ ఉంది. […]
ఎన్డీటీవీ సర్వే: తమ్ముళ్ళ జోరు…!
రాష్ట్రంలో రాజకీయం హోరాహోరీగా నడుస్తున్న విషయం తెలిసిందే…అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీల మధ్య పోరు తీవ్ర స్థాయిలో నడుస్తోంది..ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే..అప్పుడు రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది…రెండు పార్టీలు ఎన్నికలే టార్గెట్ గా ముందుకెళుతున్నాయి. ఎలాగైనా మళ్ళీ గెలిచి అధికారంలోకి రావాలని వైసీపీ, ఈ సారి ఖచ్చితంగా గెలవాలని టీడీపీ చూస్తుంది. మొత్తానికి రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఇక ఎన్నికల సీజన్ మొదలు కావడంతో రాష్ట్రంలో సర్వేల జోరు ఎక్కువైంది. ఇప్పటికే పలు […]