టాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మిక కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం యానిమల్.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో తెరకెక్కించారు . ఇటీవలే టీజర్ విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.ఆ తర్వాత ఒక్కసారిగా ఈ సినిమా మీద అంచనాలు పెరిగిపోవడంతో యానిమల్ సినిమా ఈసారి కచ్చితంగా బాలీవుడ్లో సంచలనాలు సృష్టిస్తుందని అభిమానుల సైతం నమ్మకంతో ఉన్నారు. డిసెంబర్ 1వ తేదీన పాన్ ఇండియా లెవెల్లో ఐదు భాషలలో ఒకేసారి విడుదల కాబోతోంది యానిమల్ చిత్రం.
ఇందులో అనిల్ కపూర్ ,బాబీ డియోల్ తదితరులు సైతం కీలకమైన పాత్రలు నటిస్తూ ఉన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది. అదేమిటంటే డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా ఈ చిత్రంలో హీరో హీరోయిన్ల మధ్య ఫస్ట్ నైట్ ను చాలా అత్యంత హింసాత్మకంగా ప్లాన్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. రష్మిక ,రణబీర్ వివాహం చేసుకున్న తర్వాత సాంప్రదాయమైన తెర్లని ధోతి తెల్లటి చీరలో తమ మొదటి రాత్రికి సిద్ధమవుతూ ఉంటారు.
ఇక అలాంటి సమయంలోనే సరిగ్గా గుండాల గుంపు రణబీర్ నివాసం పైన దాడి చేస్తుందట. రణబీర్ ఒకవైపు గూండాలను ఒక రేంజ్ లో ఆడుకుంటూనే మరొకవైపు రష్మిక తో రొమాన్స్ చేస్తూ ఉంటాడని సమాచారం..అంటే ఒకపక్క హింస మరొకపక్క శృంగారం చేసే సన్నివేశాలు ఒక రేంజ్ లో తెరకెక్కించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఎపిసోడ్తో ఈ సినిమా అదిరిపోయేలా ఉంటుందని ఈ సినిమా మొత్తానికి ఈ ఎపిసోడ్ చాలా హైలైట్ గా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే..