టాలీవుడ్ యాక్ట్రెస్ రష్మిక మందన్న ప్రస్తుతం ‘యానిమల్’, పుష్ప 2 సినిమా షూటింగ్స్లో పాల్గొంటూ చాలా బిజీగా గడుపుతోంది. బర్త్ డే రోజున రెయిన్ బో అనే కొత్త సినిమాలో నటించడానికి ఒకే చెప్పేసింది. తాజాగా రష్మిక ఈ మూవీ సెట్లో దిగిన ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోలో, ఆమె తన అందమైన కళ్లను చూపిస్తూ తన ముఖాన్ని సగం చూపించి సగం దాచేసింది. ఆ ఫొటోని ట్యాగ్ చేస్తూ “రెయిన్బో సెట్స్ నుంచి హాయ్” అంటూ రాసుకొచ్చింది. ఈ ఫొటోతో రష్మిక ఈ మూవీ ప్రారంభించినట్లు క్లారిటీ ఇచ్చింది.
అయితే రష్మిక ఈ సినిమాపై చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అలానే సినిమాపై హైప్ పెంచేసాయి. ఈ ముద్దుగుమ్మ తాజా పోస్ట్ లో “రెయిన్బో సినిమా స్టోరీ చాలా అద్భుతంగా ఉంది, నేను దానిని మాటల్లో చెప్పలేను కానీ తెరపై మీ అందరి కోసం త్వరలోనే తీసుకొస్తాను. దాని కోసం, నాకు మీ ప్రేమ, ఆశీస్సులు కావాలి. ఎందుకంటే మీరు లేకుండా విజయం సాధించడం సాధ్యం కాదు. ఈ సినిమాతో నేను మిమ్మల్ని అలరిస్తానని ఆశిస్తున్నాను ” అంటూ రాస్కొచ్చింది.
ప్రస్తుతం రష్మిక మిషన్ మజ్ను, పుష్ప 2, యానిమల్ సినిమాలలో నటిస్తోంది. నితిన్ వెంకీ కుడుములతో కలిసి మరో మూవీ కూడా చేస్తోంది. పుష్ప 2లో రష్మిక మరింత అందంగా కనిపించనుందని ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదలైన పోస్టర్ బట్టి చూస్తే తెలుస్తోంది. ఏమైనా రష్మిక చేతిలో ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన మూవీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటన్నిటితో ఈ తార అటు కోలీవుడ్, బాలీవుడ్లో, ఇటు టాలీవుడ్లో మరింత పాపులర్ అవుతుందని చెప్పొచ్చు.