యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాను స్టార్ దర్శకుడు కొరటాల శివతో చేయబోతున్నాడు. ఈ సినిమా అప్డేట్ వచ్చి చాలాకాలం అవుతున్న ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టలేదు. ఇక న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమాను 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నట్టు అప్డేట్ ఇచ్చింది. ఇక ఈ సినిమా షూటింగ్ వచ్చేనెల ఫిబ్రవరి నుంచి ప్రారంభం అవుతుందని కూడా మేకర్స్ చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ఎంచుకోవడం వెనుక ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందట.ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయడం వల్ల ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమా కలెక్షన్ల విషయంలో ఎలాంటి డొక్కా ఉండదని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా విడుదలైన నాలుగు రోజులకు ఉగాది పండుగ కాగా.. ఏప్రిల్ 11 న ఈద్,ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 17న శ్రీరామనవమి ఉన్నాయి.
ఇలా వరుస సెలవులతో ఈ సినిమాకు రెండు వారాలపాటు కలెక్షన్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సంవత్సరం ముందుగానే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించడం ద్వారా ఆ తేదీకి మరో సినిమా రాకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తారక్- కొరటాల ఈ సినిమా విషయంలో కూడా ఎంతో పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారని తెలుస్తుంది. ఈ సినిమా కోసం ముందుగా అనుకున్న కథ కాకుండా మరో కథపై కొరటాల దృష్టి పెట్టడంతోనే ఈ సినిమా షూటింగ్ ఇంత ఆలస్యమైందిట.
ఈ సినిమాను మేకర్స్ రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తుండడంతో, కథ, కాస్టింగ్ విషయంలో చిత్ర యూనిట్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇప్పటివరకు బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు ఎంతోమంది పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ కూడా దసరాకి పూర్తి కానుందని తెలిసింది. కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని సమాచారం.