సెప్టెంబర్ 10న జరిగిన బైక్ ప్రమాదంలో మెగా మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అపోలో హాస్పిటల్ లో అడ్మిట్ అయిన తేజ్.. దాదాపు 35 రోజుల పాటు చికిత్స తీసుకుని ఈ మధ్యే డిశ్చార్జ్ అయ్యారు. తేజ్ కోలుకోవడంతో అటు మెగా ఫ్యామిలీ మెంబర్స్, ఇటు అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.
అయితే యాక్సిడెంట్ అయిన దగ్గరనించి ఇప్పటిదాకా తేజ్ తన ముఖమే చూపించలేదు. డిశ్చార్జ్ అయ్యేటప్పుడూ థమ్సప్ సింబల్ మాత్రం చూపించి ట్వీట్ చేశాడు తప్పా ఫేస్ చూపలేదు. తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన ట్వీట్లోనూ కేవలం చేతులే ఫోటో తీసి షేర్ చేశారు. దాంతో అభిమానుల్లో ఖంగారు మొదలైంది.
ఈ క్రమంలోనే తేజ్ ఎందుకని ఫేస్ చూపించటం లేదంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు తేజ్ ముఖానికి ఏదైనా గాయం అయ్యుండొచ్చని.. ఆ కారణంగానే ఫేస్ చూపించడం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ఇదే నిజమా..? లేక మరేదైనా రీజన్ ఉందా..? అన్నది తెలియాలంటే తేజ్ స్పందించాల్సిందే.