బుల్లితెర నటి ఉమామహేశ్వరి కన్నుమూత..?

తమిళ బుల్లితెర నటి ఉమా మహేశ్వరీ కన్నుమూసింది. నిన్న ఆదివారం రోజు చెన్నై లొ కన్ను మూశారు. ప్రస్తుతం ఆమె వయసు 40 ఏళ్ళు.ఈమె గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఇక రాను రాను ఆరోగ్య పరిస్థితి విషయమించడంతో ఈమె తుది శ్వాస విడిచింది. ఇక ఈమె తమిళ బుల్లితెర పై ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఈమె మొట్టి ఒలి అనే టీవీ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు ఏర్పరచుకుంది. ఆ తరువాత ఒరు కథైయిన్ కథై, మంజల్ మహిమై, ఇలాంటి సీరియల్స్ లో ప్రధాన పాత్రలో నటించింది. అలాగే వెట్టిచాకిరి, కొడికట్టు, అల్లు అర్జున్ లాంటి సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించింది. ఈమె భర్త మురుగన్ పశు వైద్యుడు. వివాహం తరువాత ఉమామహేశ్వరి నటనకు స్వస్తి చెప్పింది. ఈమె తమిళ సీరియల్స్ ద్వారా అత్యంత ప్రజాదరణ పొందింది.