టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ తాజా చిత్రం `మాస్ట్రో`. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్గా నటిస్తుండగా.. మిల్కీబ్యూటీ తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ మూవీని శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై నికితా రెడ్డి, సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో సెప్టెంబర్ 9న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా మేకర్స్ మాస్ట్రో ట్రైలర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. `కళ్ళు కనపడకపోతే ఇబ్బందులు అందరికి తెలుసు, కానీ అందులో కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి’ అని నితిన్ చెప్పే డైలాగ్తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆధ్యంతం సూపర్ థ్రిల్లింగ్గా కొనసాగింది. సినిమాల్లోనే మర్డర్ చూసి భయపడే నేను.. ఇప్పుడు నిజంగా మర్డర్ చేయాల్సి వచ్చింది’ అంటూ తమన్నా చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.
అలాగే నితిన్, తమన్నా భాటియాల మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొత్తానికి ట్రైలర్ బట్టీ చూస్తుంటే రంగ్ దే, చెక్ తో నిరాశపరిచిన నితిన్ ఈ సారి ఖచ్చితంగా హిట్ కొట్టాలనే కనిపిస్తున్నాడు. కాగా, హిందీలో విజయవంతమైన `అంధదూన్` సినిమాకి రీమేక్గా తెరకెక్కిన మాస్ట్రోను థియేటర్లోనే విడుదల చేయాలని భావించారు. కానీ, ప్రస్తుత పరిస్థితులు కారణంగా మేకర్స్ ఓటీటీ బాట పట్టారు.