సోనూసూద్.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. రిల్ లైఫ్లో విలన్ అయినప్పటికీ.. రియల్ లైఫ్లో మాత్రం దేశప్రజలందరి చేత హీరో అనిపించుకున్నారీయన. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కష్టమని వచ్చిన వారందరినీ ఆదుకున్న సోనూ.. తాజాగా సెట్లో, అదీ కూడా హీరోయిన్ ముందు బోరున విలపించారు.
ఇంతకీ సోనూ ఎందుకు ఏడ్చారు..? అసలు ఏం జరిగింది..? అన్నది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న సోనూ.. ఇటీవల `సాత్ క్యా నిభావోగే` పాటలో మెరిసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు ప్రముఖ డైరెక్టర్ ఫరాఖాన్ దర్శకత్వం వహించగా.. నిధి అగర్వాల్ సోనూకు జోడీగా నటించింది.
ఈ పాటను తొంభైలలో శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్న ‘తుమ్ తో ఠహ్రే పరదేశీ’ పాటకు రీమేక్గా తెరకెక్కించారు. ఈ నెల 9న ఈ పాట విడుదలైంది. అయితే తాజాగా ఈ సాంగ్కి సంబంధించిన మేకింగ్ వీడియోను సోనూసూద్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. అందులో ఆయన హీరోయిన్ కూర్చున కెమెరా ట్రాలీ లాగుతూ.. ఓ హిట్ సాంగ్ తీయాలంటే ఎంతో కష్టపడాలి అని ఫన్నీ కంట తడిపెట్టుకున్నారు. దాంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.
https://www.instagram.com/reel/CSbf7dyAENd/?utm_source=ig_web_copy_link